అప్పుడు కేసీఆర్ గుడి కట్టించాడు.. ఇప్పుడు అమ్మేస్తాడట..!

రాజకీయాల్లో ఏదో ఆశించి గుళ్లు కట్టడం కామన్ అయిపోయింది. తాము ఆశించింది ఇవ్వకపోతే ఆ గుళ్లు అమ్ముకునే సీజన్ కూడా వచ్చేసింది. కేసీఆర్ గుడి కట్టి వార్తల్లోకి వచ్చిన మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ మాజీ టీఆర్ఎస్ నేత ఇప్పుడు ఆ గుడిని విగ్రహంతో సహా అమ్మేస్తానని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన గుండ రవీందర్ తన ఇంటి ముందు గుడి నిర్మించారు. అందులో కేసీఆర్ విగ్రహాన్ని పెట్టి రోజూ పూజలు చేసేవారు.

గుండ రవీందర్ 2010 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సుమారు రూ.3లక్షలు పెట్టి ఆలయం నిర్మించి అందులో కేసీఆర్, జయశంకర్ సార్, తెలంగాణ తల్లి విగ్రహాలను పెట్టారు. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం పట్టించుకోలేదు. ఆయన మామూలుగా కేబుల్ ఆపరేటర్‌గా ఉన్నారు. తర్వాత దాన్ని కూడా టీఆర్ఎస్ జిల్లాస్థాయి నేతలు లాగేసుకున్నారు. దీంతో ఉపాధి కూడా లేకుండా పోయింది . తనను ఆదుకోవాలని కేసీఆర్‌, కేటీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు.

తర్వాత తను కట్టినగుడి ముందే నిరసన చేశారు. ఓ సారి టవర్ ఎక్కారు. ఎవరూ పట్టించుకోలేదు. చివరికి గుడిలో విగ్రహాలకు ముసుగులు వేసి పూజలు ఆపేసి.. బీజేపీలో చేరిపోయారు. బీజేపీలో చేరిన తర్వాత ఇక కేసీఆర్ గుడి అవసరం ఏముందనుకున్నారేమో కానీ అమ్మకానికి పెట్టేశారు. ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు. కొనేందుకు ముందుకు వస్తున్నారని.. ఎవరూ రాకుంటే కూల్చి వేస్తానని రవీందర్ చెబుతున్నారు. ఈ ఫేస్‌బుక్ పోస్ట్ కింద కామెంట్లలో అనేక మంది తాము కూడా ఉద్యమం కోసం పని చేసామని.. లక్షలు ఖర్చు పెట్టుకున్నామని కానీ తమకూ పదవులు రాలేదని వాపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close