టీడీపీ, జనసేనకు ఆచంట దారి చూపిస్తున్న రఘురామ !

ఉభయగోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన స్థానిక నాయకత్వం పొత్తులు పెట్టుకుని కొన్ని చోట్ల సమన్వయంతో కలిసి పని చేసి మంచి ఫలితాలు సాధించాయి. కడియం, ఆచంట వంటి చోట్ల విజయాలు సాధించారు. మండల పరిషత్ చైర్మన్ పదవుల విషయంలోనూ ఈ రెండు పార్టీలు కలసి పని చేశాయి. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో రెండు పార్టీల నేతలు పొత్తులు పెట్టుకుని పోటీచేయడమే కాకుండా ఎంపీపీ చైర్మన్ విషయంలోనూ అదే అవగాహనకు వచ్చారు. చైర్మన్ పీఠాన్ని టీడీపీ, వైస్ చైర్మన్ పీఠాన్ని జనసేన తీసుకున్నాయి. గుంటూరు జిల్లా దుగ్గిరాలలోనూ టీడీపీకి జనసేన మద్దతివ్వాలని నిర్ణయించుకుంది.

ఈ పరిణామాలను వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాజకీయాల్లో మార్పుల కోణంలో ఆవిష్కరిస్తున్నారు. అక్కడ స్థానిక నాయకత్వం కలసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకుని ఉండవచ్చు కానీ.. రాష్ట్ర వ్యాప్తంగా రెండు పార్టీలు అవగాహనకు వస్తే రాజకీయాలు మారిపోతాయని ఆయన అంటున్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన రెండు, పార్టీలు కలిస్తే మంచి పలితం ఉంటని విశ్లేషించడానికి చాలా కారణాలు చెప్పారు. భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తు ఏమాత్రం కలసి రావడం లేదని తిరుపతి ఉపఎన్నిక సహా అనేక అంశాలు తేల్చేశాయి.

జనసేన బలాన్ని తమ బలంగా చెప్పుకోవడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రభుత్వంపై పోరాటానికి ప్రయత్నించడం లేదన్న అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల ఫలితాలు ఆ పార్టీ విధానంలో ఏమైనా మార్పు తెస్తాయా అన్న చర్చ తాజా ఆచంట ఫలితంతో ప్రారంభమైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close