పోసాని మళ్లీ రచ్చ – దాడికి ప్రయత్నించిన పవన్ ఫ్యాన్స్ !

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరోసారి మీడియా ముందుకు వచ్చిన పోసాని కృష్ణమురళి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం పెట్టి “పవన్ నీకెంత మంది భార్యలు.. ఎంత మందిని మోసం చేశావు” అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలను టీవీ చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయడంతో ప్రెస్ క్లబ్ వద్దకు పెద్ద ఎత్తున పవన్ ఫ్యాన్స్ వచ్చారు. పోసాని సంగతి చూస్తామంటూ హెచ్చరికలు చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది.

తన భార్యపై ఎవరో పోస్టులు పెట్టారంటూ పోసాని ఎమోషనల్ అయ్యారు. దానికి పవన్ కల్యాణ్‌ను నిందించారు. తన భార్యంటే తనకు ప్రాణమని.. ఆమె తనకు భార్య మాత్రమే కాదు ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు. ఆమె చనిపోయిన రోజే తాను చనిపోతానని ప్రకటించారు. గతంలో పోసాని భార్యతో ఆయనకు విబేధాలు ఉండేవని.. ఆమె ఓ సారి ఆత్మహత్యాయత్నం చేసిందని.. ఇలా పలు రకాలుగా పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇవి ఆయన చదివి ఆవేశం తెచ్చుకుని ప్రెస్‌క్లబ్ లో సమావేశం పెట్టారు.

సమావేశం ముగిసిన తర్వాత కూడా ప్రెస్ క్లబ్ బయట పెద్ద ఎత్తున పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఉండటంతో పోసానిని సొంతకారులో వెళ్లవద్దని పోలీసులు సూచించారు. తమ కారులోనే ఇంటి దగ్గర దిగబెట్టాలని నిర్ణయించారు. ఆయనకు భద్రత కల్పించి క్షేమంగా కారులో కూర్చుబెట్టి ఇంటి వైపు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి .. తనకు ఏమైనా అయితే పవన్ కల్యాణ్‌దే బాధ్యత అని ప్రకటించారు. తాను పవన్ కల్యాణ్‌పై కేసు పెడతానని హెచ్చరించారు. పవన్‌పై పోసాని ఎటాక్‌తో ఈ వివాదం మరింత ముదురుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close