పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారు : పేర్ని నాని

చిరంజీవి తరపున ఏపీ మంత్రి పేర్ని నాని ప్రకటనలు చేయడం ఆపడం లేదు. గతంలో ఆన్ లైన్ టిక్కెట్లు ‌అమ్మాలని చిరంజీవే కోరానని ఆయన ప్రకటించారు. అయితే చిరంజీవి ఈ అంశంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా చిరంజీవి తరపున పేర్ని నాని మరో ప్రకటన చేశారు. రిపబ్లిక్ సినిమా ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి తనతో మాట్లాడారని.. ఆయన విచారం వ్యక్తం చేశారని పేర్ని నాని ప్రకటించుకుంటున్నారు. పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదని చిరంజీవి చెప్పారన్నారు. సినిమా నిర్మాతలతో మచిలీపట్నంలో సమావేశం అయిపోయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

సినిమా ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలతో తమకు సంబంధం లేదని చెప్పడానికే నిర్మాతలు వచ్చారని పేర్ని నానిచెప్పుకున్నారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ కొత్తదికాదని ఆ విధానానికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉందన్నారు. టాలీవుడ్ సమస్యలపై సీఎం సానుకూలంగా ఉన్నారన్నారు. పవన్ కల్యాణ్ కిరాయి పార్టీని నడుపుతున్నారని మండిపడ్డారు. కిరాయికి పని చేసేదెవరో అందరికీ తెలుసన్నారు. రాజకీయ పార్టీని టెంట్ హౌస్‌గా అద్దెకిస్తూంటారని ఆరోపించారు. అయితే మీడియాతో మాట్లాడిన నిర్మాత దిల్ రాజు మాత్రం బ్యాలెన్సుడ్‌గా స్పందించారు. సినీ పరిశ్రమ సున్నితమైనదని.. వివాదాల్లోకి లాగవద్దని కోరారు. సినిమా టిక్కెట్ల రేట్లు పెంచాలని కోరామని.. గత సమావేశంలోనూ కోరామన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.

పవన్ కల్యాణ్ ఓ వైపు మంగళగిరిలో పార్టీ సమావేశం పెట్టి ప్రభుత్వం, వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న సమయంలోనే వ్యూహాత్మకంగా నిర్మాతల్ని మంత్రి పిలిపించుకున్నట్లుగా భావిస్తున్నారు. పవన్ సమావేశం జరుగుతున్న సమయంలో చిరంజీవి పేరుతో పేర్ని నాని ప్రకటన చేయడం … సినీ పరిశ్రమ పవన్ వైపు లేదని చెప్పడానికి ప్రయత్నించడం వ్యూహం ప్రకారం చేస్తున్నారని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎయిర్‌లైన్స్‌ సహా ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ… ప్రధాని సంచలన నిర్ణయం

కొన్నేళ్లుగా ఆర్థిక , రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ ను తిరిగి గాడిన పెట్టేందుకు ఇటీవల ఎన్నికైన కొత్త ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలను అమలు చేయాలని...

వైసీపీ కుట్రలకు వీరనారిలా ఎదురు నిలిచిన మహిళ..!!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసింది. వ్యవస్థలను తమ చెప్పు,చేతుల్లో ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చిందన్న విమర్శలు మూటగట్టుకుంది. దాంతో ఎన్నికలను కూడా సరైన విధంగా నిర్వహించేందుకు వైసీపీ సహకరిస్తుందా..? అనే...

రంగంలోకి కేజ్రీవాల్… బీజేపీ ఆశలపై నీళ్లు చల్లుతారా..?

మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇటీవల మధ్యంతర బెయిల్ రావడంతో ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎంతమేర ఉంటుందనేది చర్చనీయాంశం అవుతోంది. గతంలో ఢిల్లీలోని లోక్ సభ...

టాలీవుడ్ కి తొలి ప్రమాద హెచ్చరిక

తెలంగాణలో రెండు వారాల పాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తోందని, దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close