అప్పుడు పనామా..ఇప్పుడు పండోరా పేపర్లు !

పనామా పేపర్ల పేరుతో గతంలో లీకయిన ప్రముఖుల విదేశీ లావాదేవీల వ్యవహారాలు రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అలాంటిదే పండోరా పేపర్ల పేరుతో అంతర్జాతీయ పరిశోధన జర్నలిస్టుల గ్రూప్ కొన్ని డాక్యుమెంట్లలో వెలుగులోకి తెచ్చింది. వీటిలో ప్రపంచ వ్యాప్తంగా 35 మంది దేశాధినేతలు, ప్రధానులు, మాజీల అక్రమ లావాదేవీల గుట్టు ఉంది. భారత్‌కు చెందిన 380 మంది వ్యవహారాలు పండోరా పేపర్స్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిలో కొంత మంది వివరాలు బయటకు వచ్చాయి. ఆరుగురు మాజీ ఎంపీలు భారీగా విదేశాల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించారుని పండోరా పేపర్స్‌ వెల్లడించినట్లుగా తెలుస్తోంది.

ఇండియాలో దివాలా తీసిన అనిల్ అంబానీ విదేశాల్లో 18 ఆఫ్‌షోర్‌ కంపెనీల ద్వారా వ్యాపారాలు చేస్తున్నట్లుగా పండోరా పేపర్స్ చెబుతున్నాయి. సచిన్‌ టెండుల్కర్‌కు కూడా బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో ఓ ట్రస్టు ఉందట. నీరవ్‌ మోడీ కూడా ఓ ట్రస్టును ఏర్పాటుచేసి మరీ పారిపోయారు. భారత్‌ నుంచి లిస్టులో ఉన్న వారిలో అత్యధిక మంది సీబీఐ, ఈడీ కేసులు, ఆర్థిక నేరాల కేసుల్లో ఉన్న వారేనని తెలుస్తోంది. వీరిలో వ్యాపార దిగ్గజాలు, రాజకీయ నాయకులే ఎక్కువ మంది ఉన్నారు.

వీరంతా తాము అక్రమంగా ఆర్జించిన సొమ్మును పన్ను ఎగవేత దేశాల్లో అత్యంత సంక్లిష్టమైన ట్రస్టులు, కంపెనీల్లో దాచుకుంటున్నారని చెప్పడమే పండోరా పేపర్స్ లీకుల ఉద్దేశం. ఆ ట్రస్టులు, కంపెనీల అసలు యజమానులెవరో తెలుసుకోవడం దర్యాప్తు సంస్థలకూ సాధ్యం కాదట. సంక్లిష్టంగా ఆఫ్‌షోర్‌ కంపెనీలు, ట్రస్టుల నిర్మాణం ఉంటుందని వారి అక్రమ సంపాదన సురక్షితంగా ఉంటుందని అంటున్నారు. రాజకీయ నేతల ప్రమేయం ఎక్కువగా ఉండటంతో ఇలా బయటకు వస్తున్న పేపర్లపై ప్రభుత్వాలు దర్యాప్తు చేయించడంలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వావ్… బీసీసీఐ తీసుకున్న నిర్ణయం మాములుగా లేదుగా!

తాజ్ మ‌హాల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలిలెవ‌రోయ్... అన్న మాట చాలా సంద‌ర్బాల్లో గుర్తుకొస్తుంది. కిందిస్థాయిలో క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే వారిని గుర్తించ‌టం, గౌర‌వించ‌టం కార్పోరేట్ వ్య‌వ‌స్థ‌లో మూల‌న ప‌డిపోయింది. కానీ, ఈసారి ఐపీఎల్ లో...

మెగా మ‌న‌సు చాటుకొన్న చిరు!

చిరంజీవి మ‌రోసారి త‌న ఉదార‌త చాటుకొన్నారు. అనారోగ్యంతో బాధ ప‌డుతున్న సినీ పాత్రికేయుడికి త‌న అభ‌యహ‌స్తం అందించారు. మీడియా స‌ర్కిల్‌లో ఉండేవాళ్ల‌కు జ‌ర్న‌లిస్టు ప్ర‌భు ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తే. చిరంజీవితో కూడా ఆయ‌న‌కు...

వైన్స్ ఓన‌ర్స్ Vs బార్ ఓన‌ర్స్… తెలంగాణ‌లో కొత్త పంచాయితీ

మూడు పువ్వులు... ఆరు కాయ‌లుగా సాగే వ్యాపారాల్లో మ‌ద్యం బిజినెస్ కూడా ఒక‌టి. తెల్లారి లేస్తే లెక్చ‌ర్లు ఇచ్చే పొలిటిక‌ల్ లీడ‌ర్స్ నుండి గ‌ల్లీ లీడ‌ర్ల వ‌ర‌కు, కార్పోరేట్ సంస్థ‌లు ఇలా...

మరోసారి రియల్ హీరో అనిపించుకున్న మెగాస్టార్

రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తన సేవా కార్యక్రమాలతో ఎంతోమందికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆయన తాజాగా ఓ జర్నలిస్టుకు తన వంతు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close