ఇండ్ర‌స్ట్రీకి పెద్ద అవ‌స‌రం లేదు:  ద‌ర్శ‌కేంద్రుడి మాట‌

టాలీవుడ్ పెద్ద ఎవ‌రు?  
– ఇప్పుడు ఇదే బిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఆ స్థానం చిరంజీవిదే అని ఓ వ‌ర్గం అంటుంటే, మ‌రో వ‌ర్గం మాత్రం `దాసరి లేని లోటు భ‌ర్తీ చేయ‌లేరు` అంటోంది. ఇంకో వ‌ర్గం.. `మంచు ఫ్యామిలీనే` పెద్ద దిక్కు అని కొత్త పాట పాడుతోంది. దీనిపై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు త‌న‌దైన శైలిలో స్పందించారు. `అస‌లు చిత్ర‌సీమ‌కు పెద్ద దిక్కే అవ‌స‌రం లేద‌`ని తేల్చేశారు.

”ఇక్క‌డ ఎవ‌రి మాట ఎవ‌రూ విన‌రు. అలాంట‌ప్పుడు స‌ల‌హాలు ఇవ్వ‌డం ఎందుకు?  చెప్పిన ప‌ని చేయ‌క‌పోతే బాధ ప‌డ‌డం ఎందుకు?  ఆ అవ‌స‌రం లేదు” అని చెప్పుకొచ్చారు రాఘ‌వేంద్ర‌రావు. ఇండ్ర‌స్ట్రీలో ఉన్న పెద్ద‌లంద‌రితోనూ ద‌ర్శ‌కేంద్రుడికి స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయ‌న‌కు చిరంజీవి కావాలి.. మోహ‌న్ బాబూ కావాలి. అందుకే మ‌ధ్యేమార్గంగా ఈ త‌ర‌హా కామెంట్లు చేశారేమో..?

”నా జీవితంలో రెండే రెండు కోరిక‌లున్నాయి. ఒక‌టి అజాత శ‌త్రువు అనిపించుకోవాలి. రెండోది.. ఎవ‌రికీ స‌ల‌హాలు ఇవ్వ‌కూడ‌దు. ఇండ్ర‌స్ట్రీ నాకు చాలా గౌర‌వించింది. ఈత‌రం దర్శ‌కులు సైతం అభిమానిస్తున్నారు. ఇప్పుడు వాళ్ల మ‌ధ్య పెద్ద‌రికం చూపించాల్సిన అవ‌సరం ఏమొచ్చింది” అంటూ… సున్నితంగా చెప్పి త‌ప్పించుకున్నారు రాఘ‌వేంద్ర‌రావు. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close