హుజురాబాద్‌లో దళిత బంధుకు బ్రేక్ !

హుజురాబాద్ ఉపఎన్నికలు జరుగుతున్నందున అక్కడ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకం ప్రక్రియను నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఈసీ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు అందాయి. ఇప్పటి వరకూ లేని అభ్యంతరాలు ఇప్పుడే ఈసీ వ్యక్తం చేయడానికి కారణం ఎవరో ఫిర్యాదు చేయడమేనని భావిస్తున్నారు. ఆ ఫిర్యాదు చేసింది బీజేపీ, కాంగ్రెస్ నేతలేనని టీఆర్ఎస్ నేతలు ఆరోపించడం… కాదు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని టీఆర్ఎస్సే గేమ్ ఆడుతోందని విపక్షాలు ఇక ఆరోపించుకునే రాజకీయం ప్రారంభమవుతుంది.

అమల్లో ఉన్న పథకాలను ఆపరు కాబట్టి .. కేసీఆర్ ముందస్తు వ్యూహం ప్రకారం షెడ్యూల్ రాక ముందే దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. నిధులు విడుదల చేశారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. అ ప్రక్రియ జరుగుతూండగానే షెడ్యూల్ వచ్చింది. అయినప్పటికీ లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఎంత మందికి ఇచ్చారో స్పష్టత లేదు. అయితే వందల్లోనే ఇచ్చి ఉంటారని.. ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదని చెబుతున్నారు.

ఇలాంటి సమయంలో దళిత బంధు ఆగిపోతే ఎన్నికలయిన తర్వాత ఇస్తారా అన్న డౌట్లు చాలా మందిలో వచ్చే అవకాశం ఉంది. గతంలో హైదరాబాద్‌లో వరద సాయం కూడా ఇలా మధ్యలో నిలిపివేసి ఎన్నికలవగానే ఇస్తామన్నారు. తర్వాత ఇవ్వలేదు. అందుకే విపక్షాలకు ఇదే ఇదో అస్త్రం అయ్యే అవకాశం ఉంది. అయితే ఎవరు ఫిర్యాదు చేశారో తేలే దాకా రాజకీయం కొనసాగుతుంది. ఇప్పటికే ఈటల పేరుతో అనేక ఫేక్ లేఖలు బయటకు వచ్చాయి. ఇప్పుడు అలాంటివి అన్ని వైపుల నుంచి దూసుకొచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close