బూతులు తిట్టారని దాడులా..? మరి వైసీపీ నేతలు స్తోత్రాలు చదివారా ?

తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై వ్యవస్థీకృతంగా జరిగిన దాడుల ఘటన ఇప్పుడు ఏపీలో సంచలనాత్మకం అవుతోంది. టీడీపీ నేతలు బూతులు మాట్లాడారని అందుకే ప్రజలు సహనం కోల్పోయారని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే ఈ సమర్థింపు కూడా కాస్త విచిత్రంగా ఉందన్న వాదన సహజంగానే ప్రజల్లో చర్చకు వస్తోంది. ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో వ్యక్తిగంతగా బూతులు తిట్టడం అనేది ప్రారంభమయింది వైసీపీ నేతలతోనే. చిన్నా, పెద్దా, మహిళలు అనే తేడా లేకుండా ఇష్టారీతిన బూతులతో విరుచుకుపడేది వైసీపీ నేతలే. ఎవరు మీడియా ముందుకొచ్చిన అదే పరిస్థితి.

వైసీపీ నేతల బూతులని వినీవినీ ప్రజలకు వీళ్లంటే ఇంతే అనుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాళ్లను ఇతరులు తిడితే.. వాళ్లు తిట్టిన దానితో పోలిస్తే అదేమంత పెద్ద విషయం కాదనే అభిప్రాయం సామాన్యులకు కూడా వస్తుంది. తాము అధికారలో ఉన్నాం కాబట్టి ఎన్ని బూతులు తిట్టినా పడాలి ఎదుటి వారు ఒక్క మాట అన్నా  కూడా తాము దాడులకు దిగుతామన్నట్లుగా వైసీపీ నేతల తీరు ఉంది.  ఎవరు తిట్టినా చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయనను కొడతామని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడటం.. వారి రాజకీయానికి పరాకాష్టగా భావింవచ్చని టీడీపీ నేతలు అంటున్నారు.

ప్రజాస్వామ్యంలో దాడులను ఎవరూ సహించరు. అధికార పార్టీ దాడులు చేసిందంటే ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోయిందన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిపోతుంది. ఎందుకంటే పాలక పార్టీకి రాష్ట్రంలో అందరి రక్షణ బాధ్యత ఉంటుంది. తమ రక్షణలో ఉన్న వారిపై ఇష్టానుసారంగా తామే దాడులు చేస్తే.. వారికి బాధ్యత లేదనుకుంటారు ప్రజలు. ఇప్పుడు అదే జరుగుతోంది. కానీ .. తమ అధికారం మత్తులో ఉన్న నేతలకు ఇది అర్థం కావడం లేదు.  తిట్టారని తాము దాడులు చేశామని సమర్థించుకునే ప్రయత్నం చేస్తే.. ఇంత వరకూ వైసీపీ నేతలు మాట్లాడిన మాటలే అందరికీ గుర్తు చేసినట్లవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close