కనగరాజ్‌కు మళ్లీ పదవి ఇచ్చారు..! ఈ సారైనా ఉంటుందా?

తమిళనాడుకు చెందిన మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్‌కు ఎలాగైనా పదవి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. మొదట ఎస్‌ఈసీ.. తర్వాత పోలీస్ కంప్లైంట్‌ అథారిటీకి చైర్మన్‌గా పదవి ఇచ్చారు. ఈ రెండు పదవులు కోర్టుల్లో నిలబడలేదు. చివరికి ఓ కమిటీలో సభ్యుడిగా తాజాగా పదవి ఇచ్చారు. పీడీ చట్టం అంటే ప్రివెన్షన్ డిటెన్షన్ చట్టం అమలుకు ప్రతిరాష్ట్రంలో ఓ సలహా మండలి ఉండాలి. ఆ సలహా మండలిని ప్రభుత్వం నియమించింది. అందులో ప్రధానమైన పదవి చైర్మన్ ను కనగరాజ్‌కు ఇవ్వలేదు.

ఎప్పుడో 22 ఏళ్ల క్రితం ఉమ్మడి హైకోర్టులో పని చేసి రిటైరన జస్టిస్ సంజీవరెడ్డి అనే 85 ఏళ్ల పెద్దాయనకు చైర్మన్ పదవి ఇచ్చారు. సభ్యుడిగా మాత్రం కనగరాజ్‌కు చాన్సిచ్చారు. కనగరాజ్‌ తమకు ఉపయోగపడ్డారు కాబట్టి ఆయనకు ఏమైనా చేయకపోతే ఉపయోగించుకుని వదిలేశామన్న ఆరోపణలు వస్తాయని.. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ఏదో ఓ పదవిని వెదికి మరీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పదవి అయినా నిలబడుతుందో లేదో చెప్పడం కష్టమే.

పీడీ యాక్ట్ సలహా మండలి అంటే… ముందస్తుగా ఎవర్ని నిర్బంధం లోకి తీసుకోవాలని సలహా ఇచ్చే వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో 80 ఏళ్లు పైబడిన వారికి పదవులు ఇవ్వొచ్చో లేదో స్పష్టత లేదు. ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తేనే కనగరాజ్‌కు ఈ పదవి కూడా ఉంటుందా.. ఊడుతుందా అనేది తేలుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close