పాజిటివ్ స్టెప్‌తో టీ కాంగ్రెస్‌కు టీఆర్ఎస్‌ షాక్ !

కాంగ్రెస్ విషయంలో టీఆర్ఎస్ తీసుకుంటున్న నిర్ణయాలు అనూహ్యంగా ఉంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేలా ఢిల్లీలో టీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకుంటోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల కూటమి భేటీకి టీఆర్ఎస్ నేత కేశవరావు హాజరయ్యారు. రాజ్యసభ నుంచి పన్నెండు మంది ఎంపీల్ని బహిష్కరించడంపై తదుపరి కార్యాచరణను ఖరారు చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విపక్ష నేతల భేటీని నిర్వహించింది. దీనికి అనూహ్యంగా టీఆర్ఎస్ నుంచి కేశవరావు హాజరయ్యారు.

ఆయన రాహుల్ గాంధీ పక్కనే కూర్చుని ముచ్చట్లు చెబుతూకనిపించారు. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ భేటీ టీ కాంగ్రెస్ నేతల్ని ఒక్క సారిగా ఆందోళనకు గురి చేసింది. బీజేపీతో కలిసి డ్రామాలు ఆడుతూ.. తమ మధ్యనే పోటీ ఉందని టీఆర్ఎస్, బీజేపీ ఓ సీన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కాంగ్రెస్‌కే తగ్గర అన్నట్లుగా ఓ ఫోటో రిలీజ్ కావడంతో రేవంత్ రెడ్డి ఆందోళనకు గురయ్యారు.

రేవంత్ రెడ్డి వెంటనే మీడియాతో మాట్లాడి.. టీఆర్ఎస్ డబుల్ గేమ్ ఆడుతోందని విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ నేత కేకే మాత్రం తాము బీజేపీకి ఎప్పుడూ దూరమేనని.. దేశానికి ఉపయోగపడే బిల్లులకు మాత్రమే మద్దతిచ్చామని చెప్పుకొచ్చారు. మొత్తానికి.. టీ కాంగ్రెస్‌ను గందరగోళంలో పడేయడంలో టీఆర్ఎస్ మరోసారి సక్సెస్ అయినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ చెప్తున్న ఆ వ్యాఖ్యలను నమ్మి జనం ఓటేస్తారా..?

తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావులు పదేపదే చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా ఇదే రొటీన్ డైలాగ్ లా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో...

పెద్దిరెడ్డి విశ్వరూపం – వాడిపోతున్న రోజా !

నగరి వైసీపీలో ఐదు మండలాల ఇంచార్జ్‌లతో పాటు ఇతర నేతలంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి.. రోజాను ఘోరంగా ఓడించి .....

ప్రశ్నించిన మహిళ చెంప చెల్లుమనిపించిన కాంగ్రెస్ అభ్యర్ధి

ఫించన్ రావడం లేదని నిలదీసిన ఉపాధి కూలీ మహిళ చెంప చెల్లుమనిపించారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. శుక్రవారం నిజామాబాద్ జిల్లా గోవింద్ పేట్ , చేపూర్, పిప్రి గ్రామాల్లో...

ఓటేస్తున్నారా ? : లా అండ్ ఆర్డర్‌ను గుర్తు చేసుకోండి !

రాష్ట్రంలో ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వడం అనేది ప్రభుత్వాలు ప్రజలకు కల్పించిన మొదటి సౌకర్యం. కానీ గత ఐదేళ్లుగా ఏపీలో ఎప్పుడైనా శాంతిభద్రతలు ఉన్నాయా?. పోనీ ప్రజలు నిర్భయంగా బతగలిగారా ?. పోనీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close