టీడీపీ పొత్తులపై వైసీపీలోనే ఎక్కువ చర్చ !

అమరావతి మహోద్యమ సభకు వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. అన్ని ప్రాంతాల నేతలూ హాజరయ్యారు. ప్రజారాజధానిగా అమరావతికి అందరి ఆమోదం లభించింది. ఈ విషయం చెప్పకుండా… సభా వేదికపై చంద్రబాబు కన్నా లక్ష్మినారాయణను దగ్గరకు రమ్మని పిలిచారని చెప్పి వైసీపీ నేతలు చర్చ లేననెత్తారు. మళ్లీ టీడీపీ బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తోందని .. టీడీపీ కంటే ఎక్కువగా వైసీపీనేతలే చర్చలు ప్రారంభించారు. కన్నా లక్ష్మినారాయణ ఇప్పుడు కనీసం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కాదు. ఆయనను దగ్గరకు తీయడం వల్ల పొత్తులు పొడుస్తాయని ఎలా భావిస్తున్నారో కానీ మొత్తంగా అయితే అమరావతి అంశాన్ని పక్కన పెట్టడానికయినా సరే ఎక్కువగా దాన్నే చర్చించినట్లుగా కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పొత్తుల అంశం ఎప్పుడూ హాట్ టాపికే. టీడీపీ ఒంటరిగా వెళ్లి ఘోరమైన దెబ్బతిన్నది. అదే సమయంలో జనసేన పార్టీతో కలిసి వెళ్లి ఉంటే కనీసం పరువైనా దక్కేదన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ మళ్లీ కలిసి… అదే సమయంలో వెల్లువలా ఉన్న ప్రజా వ్యతిరేకత పని చేస్తే వైసీపీకి గడ్డు కాలం చాలా సులువేనని రాజకీయ అంచనాలు ఉన్నాయి. జనసేన, బీజేపీ మళ్లీ టీడీపీతో కలవడానికి సిద్ధపడ్డాయన్న సంకేతాలు వస్తే ఏపీలో రాజకీయం మారిపోతుంది. గతంలో వైసీపీకి మద్దతు పలికిన ఓ బలమైన వర్గం … కూటమి వైపు వస్తుంది.

అది వైసీపీకి కోలుకోలేని దెబ్బతీస్తుంది. అందుకే.. ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేతలు..మంత్రులు కులం ప్రకారం వ్యాఖ్యలు చేసి దూరం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల మధ్య రాజకీయం ఊపందుకుంటోంది . అందుకే పొత్తుల చర్చలూ తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ చర్చలు ఎక్కువగా టీడీపీ, బీజేపీ, జనసేనల్లో కాకుండా.. ఆయా పార్టీల పొత్తుల గురించి వైసీపీలో చర్చించడమే ఇక్కడ మెయి‌న్ ట్విస్ట్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close