“ప్రత్యేక ప్యాకేజీ” నిధులు తీసుకుంటున్న ఏపీ !? అంగీకరించేశారా ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేకహోదా నిధులు ఇస్తున్నామని.. ఇప్పటికి రూ. పదహారు వేల కోట్ల వరకూ ఇచ్చామని కేంద్రమంత్రి పంకజ్ చౌధురి పార్లమెంట్‌లో ప్రకటించడం సంచలనంగా మారింది. ప్రత్యే క ప్యాకేజీలో చెప్పినట్లుగా ఇవ్వడం లేదని గత ప్రభుత్వం వాటిని తీసుకోలేదు. తర్వాత హోదానే కావాలని పట్టుబట్టింది. కానీ కేంద్రం ఎలాంటి నిర్ణయమూ ప్రకటించలేదు. హోదా ఇచ్చేది లేదని చెబుతోంది. అయితే ఈ ప్రభుత్వం ప్రత్యేకహోదా కు బదులుగా ప్యాకేజీ తీసుకుంటున్నట్లుగా కేంద్రమంత్రి చెప్పారు. అంటే… ప్యాకేజీకి అంగీకరించేనట్లేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.

అదే జరిగితే కేంద్రం భవిష్యత్‌లో కూడా ప్రత్యేక హోదా అనే ప్రస్తావన కూడా తీసుకు రాదు. హోదాకు బదులుగా ప్యాకేజీ ఇచ్చాం కదా అన్న వాదన వినిపిస్తుంది.ప్రత్యేకహోదాను అడుగుతూనే ఉంటామని చెప్పే ఏపీ సీఎం జగన్ ఎప్పుడు అడుగుతారో స్పష్టత ఉండటం లేదు. ఏదో సమావేశం జరిగినప్పుడు.. విభజన హామీల ముసుగులో దాన్ని కూడా దాచి పెట్టి కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం తప్ప ప్రత్యేకంగా హోదా కోసం పోరాడింది లేదు. కేంద్రం ఫుల్ మెజార్టీ ఉందని.. జగన్ చెబుతూ ఉంటారు. ఫుల్ మెజార్టీ ఉంటేనే కేంద్రంలో ఉంటారు. హోదా విషయంలో అన్ని పార్టీలు ప్రజల్ని పూర్తి స్థాయిలో మభ్య పెడుతున్నాయి.

ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం ఆ పని చేస్తున్నట్లుగా ఉంది. హోదాకు బదలుగా ప్రకటించిన ప్యాకేజీ నిధులను ఏపీ సర్కార్ తీసుకుని ఉంటే మాత్రం.. హోదాకు ద్రోహం చేసినట్లుగానే భావిస్తారు. ఈ విషయంలో వైసీపీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. పార్లమెంట్‌లో కేంద్రం చెప్పిన దానికి … అసలు నిజాలేంటో వైసీపీ చెప్పాల్సి ఉంది. మసిపూసి మారేడు కాయ చేయడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు. రాష్ట్రానికి నష్టం తప్ప.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close