నా ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి: మోడి

ప్రధాని నరేంద్ర మోడి ఆదివారం ఓడిశాలో బారగర్ అనే ప్రాంతంలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ “కొన్ని రాజకీయ శక్తులకు వేరే పనేమీ ఉండదు నన్ను విమర్శించడం తప్ప. ఎందుకంటే నేను అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతి అంతం చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాను. దాని వలన ఇబ్బందిపడుతున్న కొన్ని శక్తులు, వర్గాలు ఏదో విధంగా నన్ను తప్పించి నా ప్రభుత్వాన్ని కూల్చి వేయాలని కుట్రలు పన్నుతున్నాయి.”

“యూరియా బ్లాక్ మార్కెట్ ని అరికట్టడానికి దానిపై వేపనూనె పూత పోయడం తప్పనిసరి చేసింది మా ప్రభుత్వం. ఆవిధంగా చేసిన తరువాత నుండి ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా యూరియా కొరత ఉన్నట్లు పిర్యాదులు అందలేదు. వేపనూనె పూసిన యూరియా రైతులకు సకాలంలో అందుతుండటం వలన వారు చాలా లాభపడుతుంటే, యూరియాని నల్లబజారులో అమ్ముకొనే వారు చాలా నష్టపోతున్నారు. అటువంటి వారు కొందరు రాజకీయ పార్టీలతో చేతులు కలిపి నా ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అటువంటివాటికి నేను భయపడేది లేదు. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ప్రజలు నాకు అప్పగించిన ఈ భాద్యతను సక్రమంగా నిర్వహిస్తాను.”

“నా ప్రభుత్వం కేవలం పరిశ్రమల పట్లే ఆసక్తి చూపుతోందనే దుష్ప్రచారంలో కూడా నిజం లేదు. ఎందుకంటే స్టార్ట్ అప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా ద్వారా వ్యవసాయాధారిత పరిశ్రమలు వస్తే దానివలన రైతులే లాభపడతారు. రైతులు మరింత నాణ్యమయిన ఉత్పత్తులు పండించేందుకు, వాటిని మార్కెటింగ్ చేసుకొనేందుకు అవసరమయిన శిక్షణను ఇచ్చేందుకే ముద్రా యోజనా పధకాన్ని ప్రవేశపెట్టాము. 2022 నాటికి మనకి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతాయి. అప్పటిలోగా దేశంలో రైతులందరి ఆదాయం రెండింతలు పెరిగేవిధంగా మా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది,” అని మోడీ చెప్పారు.

2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని బీజేపీ తమ ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ప్రకటించినప్పుడు ఆయన పార్టీలోను, బయటా అనేక సవాళ్ళను ఎదుర్కొని, తన సత్తా చాటుకొని ప్రధాని కాగలిగారు. ఒక సాధారణ ‘ఛాయ్ వాలా’ 125 కోట్లు మంది జనాభా ఉన్న దేశానికి ప్రధాని కావడం ఒక విశేషమనుకొంటే, ప్రధానిగా ఎటువంటి అనుభవం లేకపోయినప్పటికీ అధికారం చేపట్టిన ఆరు నెలలోనే మంచి సమర్దుడయిన ప్రధానిగా పేరు సంపాదించుకొన్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు సభలో తన ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి తెర వెనుక కుట్రలు జరుగుతున్నాయి, అని బహిరంగంగా చెప్పడం చాలా విస్మయం కలిగిస్తుంది. ఇంతకంటే ఎన్నో క్లిష్టమయిన సవాళ్ళను విజయవంతంగా ఎదుర్కొన్న నరేంద్ర మోడీ, తన ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎందుకు చెప్పుకొన్నారో తెలియదు కానీ అలాగ చెప్పడం కంటే వాటిని సమర్ధంగా తిప్పికొట్టి ఆ విషయం గురించి చెప్పుకొంటే గొప్పగా ఉండేది. మోడీ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు గత 22 నెలలుగా చేయని ప్రయత్నం లేదు. బహుశః కాంగ్రెస్ పార్టీని ఉద్దేశ్యించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసారేమో?

 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close