తెలకపల్లి రవి : ఫిరాయింపుల తర్వాత… ?

వైఎస్సార్‌ పార్టీ నుంచి ఎంఎల్‌ఎలు వచ్చేస్తారని తెలుగుదేశం నాయకత్వం ఇంతగా చెబుతున్నదంటే కొందరిపై గట్టి నమ్మకం వుండబట్టే. అయితే దానివల్ల రాజకీయంగా కలిగే లాభనష్టాలేమిటన్నది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు తమను సరిగ్గా పట్టించుకోవడం లేదనే భావన కొందరు ముఖ్య నాయకులలోనే వుంది.

ఎప్పుడు ఏ పదవి ప్రకటిస్తారా అని చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. ఆయన కూడా వారిని సంతృప్తి పర్చడానికి తంటాలు పడుతున్నా చిన్న రాష్ట్రం కావడంతో పరిమితులు ఎక్కువగానే వున్నాయి. ఈ పరిస్థితులలో వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహిస్తే వారికి కూడా పదవులు పందేరాలు పనుల కానుకలు కట్టబెట్టవలసి వస్తుంది. వున్న వారికి వచ్చే వారికి మధ్య వైరుధ్యం తలెత్తుతుంది. పైగా తెలంగాణలో కెసిఆర్‌కు మొదట అత్తెసరు మెజార్టి వుండటంతో భద్రత కోసం ఇతర పార్టీల వారిని చేర్చుకోవడం అవసరమై వుండొచ్చు గాని చంద్రబాబు ప్రభుత్వానికి ఆ పరిస్థితీ లేదు. వారిని మరీ భారీ ఎత్తున చేర్చుకుంటే అప్పుడు వారిదే ఆధిక్యత అవుతుంది. సామాజిక సమీకరణలలోనూ మార్పు వస్తుంది. తెలంగాణలో తమ వారు వెళ్లిపోవడానికి ఎపిలో చేర్చుకోవడం సమాధానం కాదనే వాస్తవం తెలుగుదేశం గుర్తించవలసి వుంది. అంతేగాక ఫిరాయింపులు తెలంగాణలో చలామణి అయినంత సులభంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా నడవకపోవచ్చు. ఎందుకంటే వైసీపీకి శాసనసభలో ఢ అంటే ఢ అనగల సంఖ్యాబలం వుంది. తప్పనిసరిగా ఇది సభా ప్రతిష్టంభన వంటి పరిణామాలకు దారితీస్తుంది. ఈ కారణంగానే వచ్చే వారికి సంబంధించి స్పష్టంగా ప్రకటన వెలువడటం లేదు.మొదట్లో వెళ్లిన రేణుక వంటివారి విషయమే ఒక కొలిక్కి రాలేదని గుర్తుంచుకోవాలి. పార్టీ మారిన వారితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలు జరిపించాలనే కోర్కె అక్కడ బలంగా ముందుకొస్తుంది. వైసీపీని బలపర్చే సామాజిక తరగతులలో ఇప్పటికి పెద్ద మార్పు లేదు గనక మారిన వారిపై ఒత్తిడి కూడా ఎక్కువగానే వుంటుంది. ఫిరాయింపులు మామూలే అయినా ఈ కారణాల రీత్యా ఎపిలో ఏం జరుగుతుందో చూడవలసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close