ఈసారయినా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సమావేశాలు జరగనిస్తుందా?

రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ఇంత వరకు జరిగిన పార్లమెంటు సమావేశాలను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు హైజాక్ చేస్తున్న నేపద్యంలో ఈ సమావేశాలు ఇంచు మించు అలాగే ముగియవచ్చును. కాకపోతే ఇవి బడ్జెట్ సమావేశాలు కనుక ఈసారి కాంగ్రెస్ పార్టీ కరుణిస్తుందేమో చూడాలి. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిల్లీలో సమావేశం కాబోతోంది. అందులో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. నిజానికి పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహం అంటే అది సభా కార్యక్రమాలు జరుగకుండా ఏవిధంగా అడ్డుకోవలనే చర్చలే. అందుకు ఏఏ అంశాలు తమకు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఏ ఏ సమయాలలో ఎవరు లేవనత్తి సభను ఏవిధంగా అడ్డుకోవలనే దానిపై జరిగే చర్చలనే పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలుగా గొప్పగా చెప్పుకొంటాము.

దేశంలో అభివృద్ధి, ప్రజలలో సుఖ శాంతులకు కరువు ఉంటుందేమో కానీ సమస్యలకు ఎప్పుడూ కరువు ఉండదు. కనుక ప్రతీసారిలాగే ఈసారి కూడా మోడీ ప్రభుత్వంపై దాడి చేయడానికి ప్రతిపక్షాల వద్ద ఫిరంగులవంటి అనేక సమస్యలున్నాయి. వాటిలో హర్యానా జాట్ ల ఉద్యమం (ఆ రాష్ట్రంలో బీజేపీయే అధికారంలో ఉండటం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశం), అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేత, జె.ఎన్.టి.యు. విద్యార్ధి కన్నయ్య కుమార్ అరెస్ట్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య కేసులో ఇద్దరు కేంద్రమంత్రుల రాజినామాలకి డిమాండ్ వంటివి అనేకం సిద్దంగా ఉన్నాయి.

ప్రతిపక్షాలు తమపై సంధించబోయే ఈ అస్త్రశస్త్రాలను ఎదుర్కోవడానికి మోడీ ప్రభుత్వం కూడా సిద్దం అవుతోంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇద్దరూ కూడా సోమవారం వేర్వేరుగా ప్రతిపక్షాలతో సమావేశమయ్యి సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేయబోతున్నారు. ఈ సమావేశాలలో చర్చించి ఆమోదించవలసిన వివిధ బిల్లుల గురించి కూడా వారికి తెలియజేసి వాటి ఆమోదానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేయబోతున్నారు. కానీ అటువంటి విజ్ఞప్తులను మన్నించేసి ప్రభుత్వానికి సహకరించేసేందుకు అవేవీ ఎన్డీయే మిత్రపక్షాలు కాదు కనుక యధాప్రకారం ఉభయసభలలో రాద్ధాంతం చేయకుండా ఉండలేవు.

బహుశః ఓం ప్రధమంగా కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయల రాజీనామాలకు డిమాండ్ తో ఆ రభస మొదలుపెట్టవచ్చును. ఆ తరువాత వరుసగా చాలా అంశాలే ఉన్నాయి కనుక బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సభా కార్యక్రమాలను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వద్ద చాలా ఆయుధాలే సిద్దంగా ఉన్నాయి. ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపజేయడమే ఇప్పుడు ఒక గొప్ప వ్యూహంగా భావిస్తున్నాయి కనుక, అధికార పార్టీ వాటిని ఎదుర్కోవడం తప్పనిసరి అయిపోయింది. కానీ ఈ వ్యూహ ప్రతివ్యూహాలలో కీలకమయిన బిల్లులపై, ప్రజా సమస్యలపై సభలో అర్ధవంతమయిన చర్చలు, వాటి పరిష్కారాల కోసం సమాలోచనలు వంటివేవీ లేకుండానే సమావేశాలు ముగిసిపోతున్నాయి. ఈ పరిస్థితి ఎప్పటికయినా మారుతుందో లేదో ఎవరికీ తెలియదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close