రూ.180 కోట్ల‌కు సంత‌కం చేసిన రాజ‌మౌళి

ఆర్‌.ఆర్‌.ఆర్ ఆగిపోవ‌డంతో చాలా స‌మ‌స్య‌లు నెత్తిమీద వేసుకున్న‌ట్టైంది. ఆర్‌.ఆర్‌.ఆర్ ప్ర‌భావం మిగిలిన సినిమాల విడుద‌ల‌ల‌పై ప‌డింది. ఈ సినిమాని ఎక్కువ రేట్ల‌కు కొనుక్కున్న బ‌య్య‌ర్లు ఎప్పుడో అడ్వాన్సులు చెల్లించేశారు. ఆ వ‌డ్డీల భారం వారంతా మోయాల్సిన త‌ప్ప‌ని ప‌రిస్థితి. మ‌రోవైపు ఫైనాన్షియ‌ర్ల బెడ‌ద‌. ఆర్‌.ఆర్‌.ఆర్‌కి రూ.180 కోట్ల ఫైనాన్స్ ఉంది. వాట‌న్నింటికీ నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ డి.వి.వి.దాన‌య్యే బాధ్యుడు. ఇప్పుడు ఆ బాధ్య‌త రాజ‌మౌళి త‌న నెత్తిమీద వేసుకున్నాడు. ఆర్‌.ఆర్‌.ఆర్ వాయిదా ప‌డ‌డంతో ఫైనాన్షియర్ల నుంచి ఒత్తిడి మొద‌లైంద‌ని, ఆ రూ.180 కోట్ల‌కు రాజ‌మౌళి సంత‌కం చేశాడ‌ని తెలుస్తోంది. సాధార‌ణంగా పెద్ద సినిమాల విష‌యంలో ఫైనాన్షియ‌ర్లు ఎక్కువ స‌మ‌స్య‌లు సృష్టించ‌రు. పెద్ద సినిమా ఎప్పుడు వ‌చ్చినా, త‌మ డ‌బ్బులు సేఫ్ అన్న న‌మ్మ‌కం ఉంటుంది. ఆర్‌.ఆర్‌.ఆర్‌పై కూడా ఉంది. అయితే రాజ‌మౌళి… దాన‌య్య‌పై ఒత్తిడి త‌గ్గించ‌డానికి, ఆ బాధ్య‌త కూడా త‌న భుజాన వేసుకున్నారు. ఇలాంటిదే… `ఆచార్య‌` విష‌యంలోనూ జ‌రిగింది. `ఆచార్య‌` కూడా విడుద‌ల తేదీ వాయిదా వేసుకోవాల్సివ‌చ్చింది. మాట్ని ఎంట‌ర్ టైన్‌మెంట్స్ పై ఒత్తిడి త‌గ్గించ‌డానికి, ఆ సినిమా ఆర్థిక లావాదేవాల‌న్నీ.. త‌న‌పైన వేసుకుని, మాట్నీ సంస్థ‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించాడు కొర‌టాల శివ‌. ఇలా.. నిర్మాత‌ల‌పై భారం ప‌డ‌కుండా ద‌ర్శ‌కులు కొమ్ము కాయ‌డం చిత్ర‌సీమ‌కు నిజంగా శుభ శ‌కున‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close