రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ బిస్కెట్‌!

జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీ నాయకుడు రామసుబ్బారెడ్డి… వైకాపా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రాకను ఎంతగా వ్యతిరేకించినప్పటికీ చివరినిమిషంలో ఎందుకు వెనక్కు తగ్గారు. అభ్యంతరాలు ఉన్నప్పటికీ, పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.. అనే మాట ఎలా అనగలిగారు. ఫ్యాక్షన్‌లు విచ్చలవిడిగా నెలకొని ఉన్న సీమనుంచి.. అంత సింపుల్‌గా ఈ సమస్య ఎలా పరిష్కారం అయిపోయింది.. అంటే.. అక్కడే చంద్రబాబు అసలు చాణక్యం బయటపడుతోంది.

రామసుబ్బారెడ్డిని బుజ్జగించడానికి చంద్రబాబునాయుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్‌ చేసినట్లుగా పుకార్లు వస్తున్నాయి. మరి కొన్ని నెలల్లోనే ఆయనను చట్టసభకు తీసుకు వస్తానని, జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసుకోవడానికి దేవగుడి కుటుంబం చేరేందుకు సహకరించాలని చంద్రబాబు నచ్చజెప్పి ఒప్పించారు.

రామసుబ్బారెడ్డి తొలుత అసంతృప్తితో పార్టీనే వీడిపోవచ్చునని అంతా అనుకున్నారు. అయితే ఆయన చంద్రబాబు మాట విని పార్టీలోనే ఉండడానికి ప్రధానంగా రెండు కారణాలు చెప్పుకుంటున్నారు. ఒకటి చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఆఫర్‌ చేయడం. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడు దేవగుడి నారాయణరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పదవీకాలం త్వరలో ముగుస్తుంది. అప్పుడు ఆ జిల్లానుంచి జరిగే స్థానిక సంస్థల ప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిక్కెట్‌ రామసుబ్బారెడ్డికి ఇచ్చేలా ఒప్పందం. దీనికి సహకరించడానికి దేవగుడి బ్రదర్స్‌ ఒప్పుకున్నారు. ఆమేరకు ఎమ్మెల్సీ చేయబోతున్నారు గనుక.. రామసుబ్బారెడ్డి కాస్త తగ్గినట్లుగా తెలుస్తోంది.

అలాగే.. కొందరు మరో కారణం కూడా చెబుతున్నారు. రామసుబ్బారెడ్డి మీద ఇంకా కొన్ని క్రిమినల్‌ కేసులు పెండింగులో ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో అధికార పార్టీని వీడిపోతే ఇబ్బందులు తప్పవనే భయం కూడా ఆయనను నిలువరించినట్లు తెలుస్తున్నది. మొత్తానికి ఎంతో క్లిష్టమైన జమ్మలమడుగు సయోధ్యను చంద్రబాబు.. ఒక కొలిక్కి తీసుకువచ్చినట్లు తెలుస్తున్నది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close