రజత్‌కుమార్ “ఫైవ్‌ స్టార్ అవినీతి”పై నోరెత్తని తెలంగాణ మీడియా !

తెలంగాణ ముందస్తు ఎన్నికలను నిర్వహించిన సీఈవో, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఇరిగేషన్ లాంటి అత్యంత కీలక శాఖను చూస్తున్న సీనియర్ ఐఏఎస్ తన కూతురి పెళ్లి ఖర్చులు మొత్తాన్ని మేఘా కంపెనీతో పెట్టించడం సాక్ష్యాలతో సహా వెలుగులోకి వచ్చింది. దిన్యూస్ మినిట్ అనే వెబ్ సైట్ మొత్తం వివరాలతో సహా ఇచ్చింది. తమ కథనానికి పక్కా ఆధారాలు ఉన్నాయని చెబుతోంది. కానీ ఒక్కరంటే ఒక్కరూ కిక్కురుమనడం లేదు. ముఖ్యంగా మీడియా కూడా అప్రకటిత సైలెన్స్ పాటిస్తోంది. దీనికి కారణం ఆ మేఘా కంపెనీనేనని చెప్పుకోవచ్చు.

మేఘా కంపెనీ పెద్ద ఎత్తున రజత్ కుమార్ కూతురి పెళ్లికి ఖర్చులు పెట్టుకుంది. ఇప్పుడు మీడియా ఆకంపెనీ చేతుల్లో ఉంది. ప్రధాన ఎలక్ట్రానిక్ టీవీ చానళ్లు టెన్ టీవీ, టీవీ9, ఎన్టీవీ వంటి వాటిలో భాగస్వామ్యమో.. భాగస్వామ్యులతో వ్యాపార ఒప్పందాలో ఉన్నాయి. ఇక ప్రింట్ మీడియాలో ఆంధ్రజ్యోతి లాంటి సంస్థలు ఇలాంటి కథనాలు వస్తే కథలు..కథలుగా వడ్డిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం పట్టించుకోవడం లేదు. మేఘా కంపెనీ ఎక్కడ యాడ్స్ ఆపేస్తుందోననే భయం. మామూలుగా అయితే ఇలాంటి కథనాలను ఈనాడు ప్రచురించడం ఎప్పుడో మానేసింది.

మీడియా చెప్పడం లేదు.. కానీ ప్రజలకు తెలియకుండా ఉంటుందా..?. మెజార్టీ ప్రజలకు తెలియడం లేదు కానీ రజత్ కుమార్ అవినీతి మాత్రం రికార్డులకు ఎక్కింది.ఎవరూ తుడిచేయలేని విధంగా ఆయన ఇరుక్కుపోయారు. దీనిపై విచారణ జరపాలని రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కానీ మేఘా కంపెనీకి ప్రభుత్వ పెద్దలకు ఉన్న అనుబంధం దృష్ట్యా అలాంటి విచారణలు జరిగే అవకాశం లేదు. అనూహ్యంగా బీజేపీ నేతలు కూడా ఈ అంశంపై స్పందించకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. ఇది మేఘా కు ఉన్న పలుకుబడికి సాక్ష్యంగా భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వెదుకులాట!

బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది....

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close