ముద్రగడకి జవాబు చెప్పిన చిన రాజప్ప

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి ఎన్. చినరాజప్ప నిన్న కృష్ణా జిల్లాలో బందరు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా ప్రతినిధులతో నిన్న మాట్లాడుతూ “తునిలో జరిగిన విద్వంసంతో సంబంధం లేని స్థానిక ప్రజలు, ఇతరులపై సానికి పోలీసులు కేసులు నమోదు చేసి, వేధింపులకు పాల్పడుతున్నారని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. అది నిజం కాదు. తుని విద్వంసంపై సి.ఐ.డి. దర్యాప్తు చేసి, విద్వంసానికి పాల్పడినవారిని గుర్తించే ప్రయత్నాలు చేస్తోంది. వారిపైనే చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటాము తప్ప అమాయకులయిన ప్రజలను వేధించాల్సిన అవసరం ప్రభుత్వానికి, పోలీసులకి లేదు,” అని చెప్పారు.

కాపులకు రిజర్వేషన్లుకోరుతూ ఉద్యమించిన ముద్రగడ పద్మనాభం ఇటీవల కశింకోటలో జరిగిన కాపు నేతల సమావేశంలో పాల్గొన్నప్పుడు, పోలీసులు స్థానిక ప్రజలపై కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ఆరోపించారు. ఆ రోజు జరిగిన ఘటనలకు తానే పూర్తి బాధ్యత వహిస్తానని కనుక పోలీసులు తనను ప్రశ్నించవచ్చని చెప్పారు. హోం మంత్రి చిన రాజప్ప బహుశః ఆయనకు జవాబుగా ఈ విధంగా చెప్పి ఉండవచ్చును. తుని ఘటనలకు తానే బాధ్యుడనని, పోలీసులు తనను ప్రశ్నించవచ్చని ముద్రగడ స్వయంగా చెప్పినప్పటికీ పోలీసులు ఆయన జోలికి వెళ్ళడానికి సాహసించలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close