ప్రభుత్వం దిగివస్తోంది.. ఇక ఉద్యోగ నేతల నేతలదే బాధ్యత !

ఉద్యోగుల ఉద్యమానికి ప్రభుత్వం భయపడింది. ఇది క్రిస్టల్ క్లియర్. నిన్న మధ్యాహ్నం వరకూ బెదిరింపులతో పాటూ చేయాలనుకున్నవన్నీ చేసేసి చర్చలకు రాకుండా రెచ్చగొట్టేలా చేసిన ప్రభుత్వం సాయంత్రానికి మనసు మార్చుకుంది. తగ్గడానికి సిద్ధం చర్చలకు రావాలని బతిమాలుకుంది. చివరికి తగ్గడానికి సిద్ధమయింది. కానీ ఇక్కడా బేరాలుడుతోంది . తెగడం లేదు. కానీ ప్రభుత్వం వారు అడిగినవన్నీ ఇచ్చి అయినా సరే సమ్మెకు వెళ్లకుండా చేయాలని అనుకుంటోంది. అందుకే ఇప్పుడు బాధ్యత అంతా ఉద్యోగ సంఘ నేతలపైనే ఉంది.

ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ సెటైర్ వైరల్ అవుతోంది. జీతం పెంచమని అడగడం కాదు పాత జీతాలే ఇవ్వమని ఉద్యోగులు ప్రభుత్వం కాళ్లావేళ్లా పడుతున్నారు..  అదే సీఎం జగన్ గొప్పతనం అని చెబుతున్నారు.  ఇప్పుడు ఉద్యోగులు కూడా తమకు కత్తిరించిన హెచ్‌ఆర్ఏలు అలెవెన్స్‌లు సాధించుకోవడం గొప్ప కాదు. తమ న్యాయబద్ధమైన డిమాండ్లు మొత్తాన్ని సాధిస్తేనే గొప్ప విషయం. అంతే కానీ ప్రభుత్వం వేసే అరకొర ఆఫర్లకు ఆశపడితే ఉద్యోగ వర్గాలకు తీవ్ర నష్టం జరుగుతుంది.

ఉద్యోగ సంఘం నేతలకు ప్రభుత్వ ముఖ్యలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది నిజం. ఆ విషయాన్ని ఎవరూ కాదనలేరు. పీఆర్సీ ప్రకటించినప్పుడు చప్పట్లు కొట్టి వచ్చారు. తర్వాత ఉద్యోగుల ఒత్తిడితో ఉద్యమంలోకి వచ్చారు. చలో విజయవాడకు ఉద్యోగ సంఘం నేతలు పిలుపు మాత్రమే ఇచ్చారు. కానీ ఉద్యోగులు ఉద్యమం మీద వేసుకుని వచ్చారు. అంటే ఉద్యమం ఉద్యోగుల చేతుల్లో ఉంది. ఇప్పుడు ఉద్యోగ నేతలు వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నుంచి డిమాండ్లు సాధించి చూపెట్టాల్సి ఉంది. అంతే కానీ ఏదో ఒకటి అని రాజీ పడితే..  ఇంతకు ముందెన్నడూ జరగనంత నష్టం ఉద్యోగవర్గాలకు జరుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close