అమరావతిపై జగన్ వాట్ నెక్ట్స్ ?

అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి స్టాండ్ తీసుకోవాలన్నదానిపై తర్జన భర్జన పడుతోంది. తమ విధానం మూడు రాజధాలను బొత్స సత్యనారాయణ చెబుతున్నప్పటికీ హైకోర్టు తీర్పు ప్రకారం ఇప్పుడు ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై సీఎం జగన్ సమీక్ష చేశారు. పట్టణాభివృద్ది మంత్రి బొత్స సత్యనారాయణ, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏజీ శ్రీరాం ఈ సమావేశానికి హాజరయ్యారు. సుప్రీంకోర్టుకు వెళ్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందన్న అంశంపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పరిశీలించిన తర్వాత ఏజీ శ్రీరాం ప్రభుత్వానికి కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ దిశగా ముందుకెళ్లాలా లేదా అన్నది చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే అమరావతి విషయంలో ఇకపై న్యాయపోరాటం చేసినా ఫలితం ఉండదన్న అభిప్రాయం వైఎస్ఆర్‌సీపీలోనే ఎక్కువగా వినిపిస్తోంది. మూడు రాజధానులు చేద్దామనుకున్నా న్యాయస్థానాలు చేయనివ్వలేదన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా పంపాలనుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచిస్తున్నారు.

లేకపోతే ఈ అంశాన్ని ఎన్నికల వరకూ లాక్కెళ్తే బెటరన్న చర్చ వైసీపీలో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్ అమరావతి విషయంలో ఏం చేయాలన్నదానిపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం లేదని.. తీసుకున్నా బహిరంగంగా చెప్పరని.. మెల్లగా అమల్లో పెడతారని అంటున్నారు. ఇప్పటికే బొత్స సీఆర్డీఏ అమల్లోనే ఉందని వ్యాఖ్యానించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

దాడులు, దౌర్జన్యాలు – ఏపీలో వ్యవస్థలున్నాయా ?

పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రయాదవ్ అనే నేత పెద్దిరెడ్డి ఊరికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసం కళ్లారా చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రామ తమ సొంత సామ్రాజ్యం అన్నట్లుగా ఎవరూ...

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

కొన్ని చోట్లే గాజు గ్లాస్ – గూడుపుఠాణి క్లియర్ !

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ఆ పార్టీ పోటీ చేయని చోట ఇతరులకు కేటాయించకూడదు. ఒక వేళ అది ఫ్రీ సింబల్ అయితే.. జనసేన పార్టీ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close