అఖిలేష్ ఎన్నికల ఖర్చులను కేసీఆర్, జగన్ సర్దారట !

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని ఓడించడానికి సమాజ్ వాదీ పార్టీకి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నిధులు వెళ్లాయా ?. ఇలా వెళ్తాయని ఇప్పటి వరకూ ఎవరూ ఊహించలేదు. కానీ ఇప్పుడు బీజేపీ నేతలే ఆరోపణలు ప్రారంభించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యూపీలో బీజేపీని ఓడించడానికి తెలంగాణ రాష్ట్రసమితితో పాటు వైసీపీ కూడా డబ్బులు పంపిందని సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం వద్ద దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయంటున్నారు. అన్ని లెక్కలు బయటకు తీస్తామని చెబుతున్నారు. టీఆర్ఎస్ గతంలో బీజేపీకి వ్యతిరేకంగా జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలకు ఆర్థిక సాయం చేసిందన్న ప్రచారం జరిగిది.

అయితే అవిచిన్న రాష్ట్రాలు. యూపీ లాంటి పెద్ద రాష్ట్రంలో అధికారం కోసం పోటీ పడే పార్టీకి కూడా ఆర్థిక సాయం చేస్తుందా .. అన్నది కాస్త సందేహించాల్సిన విషయమే. అదే సమయంలో వైసీపీ అలాంటి ప్రయత్నమే చేయదని.. బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేసే పరిస్థితిలో లేదని కొంత మంది భావిస్తున్నారు. అయితే యూపీలో బీజేపీ ఓడిపోతే..బీజేపీ తమపై కాస్త ఎక్కువగా ఆధారపడుతుందని.. అది తమకు బాగా కలసి వస్తుందని లెక్కలు వేసుకున్నట్లుగా మాత్రం ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఇరప్పుడు ఆర్థిక సాయం కూడాచేసినట్లుగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇదే నిజం అయితే మాత్రం వైసీపీ బీజేపీకిపూర్తి స్థాయిలో శత్రువయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ ఇప్పటికే రాజకీయ శత్రువుగా వ్యవహరిస్తోంది. ఒక వేళ డబ్బులు పంపినలెక్కలు కేంద్రం వద్ద ఉంటే మాత్రం… పరిస్థితిని చూసి.. ఐటీ, ఈడీలు రంగంలోకిదిగే అవకాశం ఉంది. ఏ ఏ సంస్థల ద్వారా యూపీకి డబ్బులు తరలించారో లెక్కలు చూసే అవకాశం ఉంది. అదే జరిగితే.. టీఆర్ఎస్, వైసీపీ నిండా మునిగిపోతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐ ప్యాక్ బృందానికి జగన్ రెడ్డి వీడ్కోలు..?

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సేవలందించిన ఐ ప్యాక్ కార్యాలయానికి జగన్ రెడ్డి ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్...

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close