కేసీఆర్ అనుగ్రహం పోవడం వల్లే చినజీయర్‌కు కష్టాలా!?

చినజీయర్ స్వామికి ప్రస్తుతం టైం కలసి రావడం లేదు. సమతామూర్తి విగ్రహావిష్కరణ వరకూ ఆయన ప్రభ దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఎప్పుడేతే శిలాఫలకంపై కేసీఆర్ పేరు లేకుండా సమతా మూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీతో ఆవిష్కరింపచేశారో అప్పట్నుంచి ఆయనకు శని దశ ప్రారంభమయినట్లుగా కనిపిస్తోంది. వరుస వివాదాలు చుట్టు ముడుతున్నాయి. పాలకులు కన్నెత్తి కూడాచూడటం లేదు. పాలకులే చూడటం లేదంటే.. ఇక ప్రభుత్వ అధికారులు చూసే అవకాశం లేదు. ఇక పాత వీడియోలను బయటకు తీసి ఆయనను బద్నాం చేసే కార్యక్రమం జోరుగా సాగుతోంది.

ఎలాంటి మీడియా విస్తృతి.. సోషల్ మీడియా లేనప్పుడు ఆయన చాలా చాలా ప్రసంగాలు చేశారు. ఆయన ప్రవచనాల పేరుతో ఎన్నో వివాదాంశాలు మాట్లాడారు. అప్పట్లో ఆయనకు ఉండేఇమేజ్ కాబట్టి అందరూ సర్దుకుపోయారు. కానీ ఇప్పుడు వాటినే బయటకు తీసి ఆయనను డబ్బుల స్వామిగా మార్చేస్తున్నారు. చివరికి పరిపూర్ణానంద కూడా చినజీయర్ సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తన ప్రమేయం లేకుండానే.. యాదాద్రి ఆలయ మహా సంప్రోక్షణ నిర్వహిస్తోంది.

ఆయనకుకనీసం ఆహ్వానం లేదు. ఇటీవల యాదాద్రి నుంచికొంత మంది అర్చకుల్నిపిలిపించుకున్న చినజీయర్ త్వరలో తాను వస్తానని తన చేతుల మీదుగానే కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. కానీ అలాంటి వాటికి అవకాశం లేదని తేలిపోయింది. ఇప్పుడు కొత్తగా వివాదాలు చుట్టు ముడుతున్నాయి. ఇప్పటికే ఆయన విపక్ష నేతలకు టార్గెట్ అయ్యారు. ముందు ముందు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ముచ్చింతల్‌లో రాను రాను ఎక్కువ అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close