మీడియా వాచ్ : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై ఎన్టీవీ దాడి!

రేటింగ్స్‌లో నెంబర్ వన్‌గా నిలుస్తున్న ఎన్టీవీ తమ స్థానాన్ని వ్యాపార దురుద్దేశాలకు వాడుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిందని కొద్ది రోజులుగా అదే పనిగా కథనాలు రాస్తోంది. ప్రసారం చేస్తున్నారు. తమ వాదనకు అనుకూలంగా మాట్లాడేవారిని తీసుకొచ్చి అదే జరుగుతోందని చెప్పిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోందంటే ఎన్టీవీ చెప్పే కారణం జీవో 111ని రద్దు చేయడం. ఇప్పుడు ఎక్కడెక్కడో ఇళ్లు కొనాలనుకున్నవారంతా.. ఆ జీవోను రద్దు చేసినందు వల్ల వెళ్లి.. ఆ ఏరియాల్లో ఇళ్లు కొనాలని ఆగిపోతున్నారట. ధరలు తగ్గిపోతాయని అనుకుంటున్నారట.

అపార్టుమెంట్లకు బదులు ఇండిపెండెంట్ హౌస్‌లు కొనాలనే ఆలోచన చేస్తున్నారు. అన్నీ ఎన్టీవీ వాళ్లే చెబుతున్నారు. కొనుగోలుదారులు ఏమనుకుటున్నారో మాత్రం చెప్పడం లేదు. హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్లు మందగించాయి. దానికి కారణం కొనుగోలు తగ్గిపోవడం కాదు. రిజిస్ట్రేషన్ చార్జీలు భారీగా పెరగడం. ఇప్పుడు హైదరాబాద్‌లో ఏ మూలకు వెళ్లినా అపార్టుమెంట్ కనీసం రూ. యాభై లక్షలు ఉంటోంది. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రూ. నాలుగైదు లక్షలు ఖర్చవుతోంది.దీంతో చాలా మంది రిజిస్ట్రేషన్లు వాయిదా వేసుకుంటున్నారు. కొనుగోళ్లు తగ్గిపోలేదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు.

అయితే ఎన్టీవీ మాత్రం… అందరూ జీవో 111 ఎత్తేసినందున.. కొనేవాళ్లు ఎవరైనా ఇక అక్కడే కొంటారు.. కొనాలన్న ఎజెండాతో ఈ స్టోరీలు రన్ చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఎన్టీవీ రియల్ ఎస్టేట్ స్టోరీల వెనుక స్పష్టమైన వ్యాపార ఎజెండా ఉంది కానీ.. వాస్తవం లేదన్న అభిప్రాయం మాత్రం వ్యాపారుల్లో వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close