దావోస్‌లో కేటీఆర్ పెట్టుబడుల స్కోర్స్ !

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఏపీలో చంద్రబాబు హయాంలో రూ. రెండు వేల కోట్లకుపైగా పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైన లూలూ గ్రూప్ ను జగన్ సర్కార్ తరిమేసింది. ఆ తర్వాత చాలా రాష్ట్రాల్లో పెట్టుబడిపెట్టింది. ఇప్పుడు తెలంగాణలోనూ ఐదు వందల కోట్ల రూపాయలతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎంవోయూ కుదుర్చుకుంది. లూలూ గ్రూప్ భారీ షాపింగ్ మాల్స్‌తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను కూడాపెద్ద ఎత్తున నిర్వహిస్తోంది.

దావోస్ లో మంత్రి కేటీఆర్ తో సంస్థ అధిపతి యూసుఫ్ అలీ తో జరిగిన సమావేశంలో ఈ పెట్టుబడిని ప్రకటించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు తెలంగాణ ప్రభుత్వం తరఫున అవసరమైన అనుమతి పత్రాలను యూసుఫ్ అలీ కి మంత్రి కేటీఆర్ అందించారు. తదుపరి తమ గ్రూప్ తరఫున మరిన్ని పెట్టుబడులను భారీ కమర్షియల్ కాంప్లెక్స్ ల నిర్మాణాల కోసం పెట్టనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్లో తమ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ , బీమా దిగ్గజం స్విస్ రే ముందుకు వచ్చింది. కంపెనీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కేటీఆర్‌తో సమావేశమయ్యారు. తొలుత 250 మంది ఉద్యోగులతో తమ కార్యాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. తమ సంస్థకు అవసరమైన ఇన్నోవేషన్ మరియు ఇతర అంశాలకు సంబంధించి తెలంగాణలోని టీ హబ్ వంటి ఇంకుబేటర్ లతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్విస్ రే తెలిపింది.

హైదరాబాద్‌లో స్పానిష్ మల్టీ నేషనల్ కంపెనీ కీమో 100 కోట్ల రూపాయలతో తమ కార్యకలాపాలను విస్తరించేదుకు నిర్ణయించింది. కీమో ఫార్మా ఇప్పటికే హైదరాబాద్ నగరం లో తన కార్యకలాపాలను కొనసాగిస్తుండగా దీనికి అదనంగా తన రెండో ఉత్పత్తి యూనిట్ ను 100 కోట్ల రూపాయలతో ప్రారంభించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. మరో వైపు ఇండియాలో వేగంగా ఎదుగుతున్న ఆన్‌లైన్ బిజినెస్ ఫ్లాట్ ఫార్మ్ మీ షో కూడాహైదరాబాద్‌లో ఫెసిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు దావోస్‌లో ఒప్పందం చేసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close