తెలంగాణలోనూ మసీదులు తవ్వుదామంటున్న బండి సంజయ్ !

బండి సంజయ్ ఏ మాత్రం మొహమాటలు పెట్టుకోవడం లేదు. ముందూ వెనుకా ఆలోచించడం లేదు. తన రాజకీయం తాను చేస్తున్నారు. యూపీలో జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిందని.. తెలంగాణలోనూ అదే వాదన తీసుకొస్తున్నారు. తెలంగాణలోనూ వేలాది ఆలయాలను గతంలో ధ్వంసం చేశారని, మసీదులు తవ్వితే శివలింగాలు బయటపడతాయన్నారు. తెలంగాణలోనున్న మసీదులను తవ్వి చూద్దాం… శవాలొస్తే మీవి…. శివం వస్తే మావి అందుకు మీరు సిద్ధమా?’ అని మజ్లిస్ చీఫ్‌కు సవాల్ చేశారు. కరీంనగర్ లో బండి సంజయ్ హిందూ ఏక్తా యాత్ర నిర్వహించారు. అందులో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ యాత్రలో దారుణమైన భాషను బండి సజయ్ వాడారు. బీజేపీకి అలవాటైన విధంగా ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకుని రెచ్చగొట్టేలా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని కాపాడాలని కరీంనగర్ ప్రజలు తనను పంపారని.. తెలంగాణకు పట్టిన శనిని కాషాయంతో తుడిచేసి రాష్ట్రాన్ని పవిత్రం చేసే బాధ్యతను తీసుకున్నానని ప్రకటించారు. కరీంనగర్ నడిబొడ్డున ఈద్గా … వేములవాడలో దర్గా పోవాలంటే రామరాజ్యం రావాల్సిందేనని సంజయ్ చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూశారు…. అతి త్వరలో రజాకార్ ఫైల్స్ సినిమా రాబోతోందని ప్రకటించారు.

ఉగ్రవాద శిక్షణా కేంద్రాలుగా మదర్సాలున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అధికారిక భాషగా ఉన్న ఊర్దును శాశ్వతంగా రద్దు చేస్తామన్నారు. మదర్సాలను శాశ్వతంగా నిషేధించి.. మైనారిటీ రిజర్వేషన్లను పూర్తిగా తుడిచేస్తామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో హిందువులకు ప్రమాదం పొంచి ఉంది. అందుకే ప్రతి ఒక్క హిందువు కలిసి కట్టుగా సాగాలని పిలుపునిచ్చారు. అధికారం కోసం బండి సంజయ్ .. చాలా దూకుడుగా ఉన్నారని ఈ వ్యాఖ్యలతో అర్థమవుతోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close