కేసుల భయంలో జనసేన – డీజీపీ దగ్గరకు పవన్

ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ జనసేన పార్టీపై ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలపై కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తలు తమ ఆందోళలను పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇటీవలి కాలంలో పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. అవి పెద్దగా ప్రచారంలోకి రావడం లేదు. కానీ ఇలాంటివి పదుల సంఖ్యలో ఘటనలు వెలుగులోకి వస్తూండటంతో పార్టీ పెద్దలు కూడా విషయాన్ని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. క్యాడర్‌కు ఏర్పడిన కష్టాన్ని సీరియస్‌గా తీసుకున్న పవన్ కల్యాణ్ నేరుగా డీజీపీని కలవాలని భావిస్తున్నారు. ఈ మేరకు తమ నేతలపై పెట్టిన తప్పుడు కేసుల వివరాలను సేకరించాలని ఆదేశించారు.

ఇప్పటికే జనసేన నేతలు .. తమ క్యాడర్‌పై పెట్టిన కేసుల వివరాలను సేకరిస్తున్నారు. దాదాపుగా వందకుపైగానే ఉన్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ రాజకీయంగా వారిపై ఒత్తిడి పెంచడానికి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటానికి చేసిన హెచ్చరికలుగానే జనసేన అగ్రనేతలు చూస్తున్నారు. ఈ వివరాలన్నింటితో పవన్ కల్యాణ్ డీజీపీ ద్గగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సమయం కావాలని డీజీపీని జనసేన వర్గాలు అడిగాయి. అయితే.. డీజీపీ ఆయనకు అవకాశం ఇస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం ఏపీలో డీజీపీ స్థాయి అధికారులు విపక్షాల వినతి పత్రాలుతీసుకోవడం కూడా ఎప్పుడో ఆగిపోయింది.

గౌతం సవాంగ్ డీజీపీ గా ఉన్న సమయంలో అయితే… రాజకీయ ప్రకటనలతో ప్రెస్ మీట్లు కూడా నిర్వహించేవారు. ఇప్పుడు కొత్త డీజీపీ వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటన్నది ఇంకా స్పష్టత లేదు. పవన్ కు డీజీపీ సమయం ఇస్తారా లేదా అన్నది జనసేన వర్గాలకూ ఉత్కంఠగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close