అల్లూరిని తెలంగాణ సాయుధ పోరాట యోధుడ్ని చేసేసిన బీజేపీ !

చరిత్ర అంటే ఔరంగజేబులు.. మొఘలుల రాజ్యాలు.. దండయాత్రలు.. మసీదులు..గుళ్లను మార్చడమే కాదు.. కావాలంటే సాయుధ పోరాట చరిత్రలు కూడా మార్చేస్తామని బీజేపీ మరోసారి నిరూపించింది. ఏ మత్రం మొహమాటపడకుండా ఆర్ఆర్ఆర్ సినిమా తరహాలో అల్లూరి సీతారామరాజును తెలంగాణ సాయుధ పోరాట యోధుడ్ని చేసేసింది. ఎవరో ఆషామాషీ నేతలు ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటే… పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ నేరుగా అమిత్ షానే చెప్పారు. అంతే కాదు.. అమర వీరుల జాబితాలో అల్లూరి ఫోటోను కూడా పెట్టారు. ఢిల్లీలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఈ విశేషం జరిగింది.

అమిత్ షా అల్లూరి సీతారామరాజు తెలంగాణ విముక్తి కోసం రాంజీగోండు, కొమురంభీంతో కలిసి నిజాంపై పోరాటం చేశారని ప్రకటించేశారు. అమిత్ షా స్పీచ్ ఎవరు రాశారో కానీ.. ఆర్ ఆర్ఆర్ సినిమా ప్రభావం ఆయనపై బాగా ఉన్నట్లుందని అర్థమైపోయింది. నిజానికి ఎక్కడా అల్లూరి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని ఇంత వరకూ ఎవరూ చెప్పలేదు. ఎలాంటి చరిత్ర లేదు. ఇది తెలంగాణ చరిత్రను, అల్లూరి వీరత్వాన్ని రెండింటినీ కించపర్చడమేనని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. వాట్సాప్ యూనివర్శిటీ సైడ్ ఎఫెక్టులని కేటీఆర్ విమర్శించారు.

తెలంగాణ గురించి బీజేపీ నేతలకు అసలు ఏమీ తెలియదని ఈ వీడియో క్లిప్ పట్టుకుని టీఆర్ఎస్ నేతలు ట్రోలింగ్ చేస్తున్నారు. వారికి బీజేపీ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమా కల్పితం అని చెప్పినా.. అల్లూరి ఎప్పుడూ కొమురంభీంను కలవలేదని .. తాము ఫిక్షన్ గా కథ చెప్పామని చెప్పినా చాలా మంది వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు అదే కథను బీజేపీ కూడా చెప్పడం ప్రారంభించింది. దీంతో బీజేపీ మార్క్ చరిత్ర .. వాట్సాప్ యూనివర్శిటీ ప్రభావం అంటూ ట్రోలింగ్ ఎదుర్కొంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close