జగన్ వారం అడిగితే సీబీఐ కోర్టు 10 రోజులిచ్చింది !

అక్రమాస్తుల కేసులో నిందితుడైన జగన్ తన కుమార్తె చదువుకుంటున్న కాలేజీలో కాన్వొకేషన్‌లో పాల్గొనేందుకు పారిస్ వెళ్లేందుకు వారం రోజుల పర్మిషన్ కావాలని సీబీఐ కోర్టును అడిగారు. అలా ఇవ్వద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. వాదనలు విన్న తర్వాత సీబీఐ కోర్టు న్యాయమూర్తి పది రోజుల పర్మిషన్ ఇచ్చారు. అసలు జగన్ అడిగితే వారం అయితే.. న్యాయమూర్తి పది రోజుల పర్మిషన్ ఇవ్వడంతో జగన్ తరపు లాయర్లు ఖుషీ అయ్యారు. సీబీఐ న్యాయవాదులు ఉత్తినే కౌంటర్ వేశారా.. లేకపోతే ఏమైనా వాదనలు వినిపించారా అనే సెటైర్లు బయట నుంచి వినిపిస్తున్నాయి.

అడిగిన దాని కంటే ఎక్కువ రోజులు పర్మిషన్ ఇవ్వడం విచిత్రమే. సీబీఐ చాలా వరకూ అక్రమాస్తుల కేసుల్లో జగన్ కు సానుకూలంగా ఉంటోందని… విచారణ ఆలస్యం కావడానికి సహకరిస్తోందన్న ఇతర పక్షాలు కొంత కాలంగా ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కోర్టుకు హాజరు కాకపోయినా పట్టించుకోవడం లేదని గుర్తు చేస్తున్నాయి. న్యాయస్థానాల నుంచి మినహాయింపులు కూడా పొందకుండానే విచారణకు రావడం లేదని అంటున్నారు. అయినా సీబీఐ ఏమీ అనడం లేదని. బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని కూడా చెప్పడం లేదన్నారు.

అదే సమయంలో జగన్ ఇటీవల దావోస్ పర్యటనకు వెళ్లారు. కోర్టు నుంచి దావోస్ పర్యటనకు మాత్రమే అనుమతి తీసుకున్నారు. కానీ ముందుగా ప్లాన్ చేసుకుని మరీ లండన్ వెళ్లి ఒకరోజు ఉండి… ఆ తర్వాత దావోస్ వెళ్లారు. అంటే బెయిల్ షరతులు.. కోర్టు షరతులు ఉల్లంఘించినట్లే. ఈ విషయాన్ని కూడా సీబీఐ కోర్టులో ప్రస్తావించలేదు. దీంతో … అంతా ఓ పద్దతి ప్రకారం.. వ్యూహాత్మకంగా కలిసి విచారణ చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close