సీఎం జగన్ పేరుతో సైబర్ నేరాలు !

అప్పుడెప్పుడో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. కోట్లు కొట్టేయడానికి దర్జాగా కోల్‌కతా సూట్ కేస్ కంపెనీల పేరుతో చెక్‌లు జమ చేశారు. ఆ కేసు ఇంత వరకూ తేలలేదు. కానీ ఇప్పుడు ఏకంగా సీఎం జగన్ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. జగన్ పీఏ నాగేశ్వర్ రెడ్డి పేరుతో ఐడీ క్రియేట్ చేసుకుని అందరూ నమ్మేలా చేస్తూ కొంత మంది ఈ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మణిపాల్ ఆస్పత్రి యజమానికి టోకరా వేయబోయారు. ఆయనకు డౌట్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే అలా చేయడం మొదటి సారి కాదని ఇప్పటికే పలువుర్ని మోసం చేశారని బయట పడింది. తాజాగా బర్జర్ పెయింట్స్ నుంచి పదిన్నర లక్షలు నొక్కేశారు. సీఎం జగన్ దావోస్‌లో ఉన్న సమయంలో ఆయన పేరుతో ఇక్కడ ఫ్రాడ్‌కు పాల్పడ్డారు. రూ. పది లక్షలు ఓ సూట్ కేస్ కంపెనీకి తరలించారు. ఇంత జరుగుతున్నా పోలీసులకు… ఎవరికీ తెలియదు. బర్జర్ పెయింట్స్ వాళ్లు వచ్చి చెబితేనే తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా .. సీఎంవో సిబ్బంది నింపాదిగా స్పందించారు. పోలీసులకు ఫిర్యాదు చేయమన్నారు.

అసలు జగన్ పేరుతో మోసాలు చేయాలనే ఆలోచన రావడం ..దాన్ని అమల్లో పెట్టడం .. పోలీసులు సీరియస్‌గా తీసుకోకపోవడం వ్యవస్థలో పేరుకుపోయిన జడత్వానికి కారణం అనుకోవచ్చు. ఓ సీఎం పేరును ఇంత విచ్చలవిడిగా వాడేసి అందర్నీ భయపెట్టేసి డబ్బులు వసూలు చేస్తూంటే.. ఇంటలిజెన్స్ వ్యవస్థ ఏమైపోయి ఉంటుంది? ఇలాంటి పరిస్థితి రావడం ముఖ్యమంత్రికి కూడా తలవంపులులాంటిదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close