రాజీనామాల రాజకీయాలు : నాడు టీడీపీ – నేడు వైసీపీ ఉక్కిరిబిక్కిరి !

ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం కేంద్రంగా రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించి .. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి రూ. ఇరవై వేల కోట్లు కావాలని కేంద్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కేంద్రంపై యుద్ధం చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు పోలవరం కోసం వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంపీలతో పాటు సీఎం జగన్ కూడా రాజీనామా చేస్తే కేంద్రం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఎందుకివ్వదో చూద్దామని చంద్రబాబు అంటున్నారు.

గతంలో ప్రత్యేకహోదా కోసం రాజీనామాల డిమాండ్ వినిపించేది. ఇరవై ఐదు మంది ఎంపీలు రాజీనామా చేస్తే ఎందుకు ప్రత్యేకహోదా రాదో చూద్దామని జగన్ చెప్పేవారు. ఎంపీలతో రాజీనామా చేయించారు. కానీ ఆరు నెలలపదవీ కాలం ఉన్నప్పుడే రాజీనామాలు చేయించడంతో ఉపఎన్నికలు రాలేదు. ఇప్పుడు పోలవరం అంశంపై రాజీనామాల డిమాండ్ తెరపైకి వచ్చింది. టీడీపీ ఎంపీలు.. వైసీపీ ఎంపీలురాజీనామా చేస్తే తాము కూడా చేస్తామని అంటున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్. వంద శాతం కేంద్రం భరించాలి. కానీ ఈ విషయంలో కేంద్రం అంత వేగంగా స్పందించడం లేదని ముఖ్యమంత్రే చెబుతున్నారు.

అప్పట్లోఎందుకు రాజీనామాలు చేయలేదని సజ్జల ప్రశ్నించారు. అప్పట్లో టీడీపీ రాజీనామాలు చేయలేదు కాబట్టి ఓడిపోయారు.. ఇప్పుడు వైసీపీ చేయకపోయినా అదే పరిస్థితి వస్తుంది కదా అంటే వైసీపీ నేతల దగ్గర సమాధానం ఉండదు. ఇలాంటి డౌట్స్ వస్తే కొడాలి నాని వంటి వారిని రంగంలోకి దింపి.. టీడీపీ నేతల్ని బండ బూతులు తిట్టిస్తున్నారు. కానీ అది సమస్యకు పరిష్కారం కాదు. కనీసం రాజీనామాల చర్చను కూడా పక్కదోవ పట్టించుదు. కొడాలి నాని బూతులు ఇప్పుడు రొటీన్ అయిపోయాయి. మరి టీడీపీ డిమాండ్ చేస్తున్నట్లుగా రాజీనామాల సవాళ్లను ముందుకు తీసుకెళ్తారా లేకపోతే… ఎదురుదాడి చేసి సర్దుకుంటారా అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మందు బాబులకు మరో షాకింగ్ న్యూస్

మందు బాబులకు మరో షాకింగ్ న్యూస్. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మరో 12 గంటలపాటు వైన్స్ షాపులు మూసివేయలంటూ ఉత్తర్వులు జారీ చేశారు పోలీసులు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో మే 11 సాయంత్రం...

బెంగ‌ళూరు ప్లే ఆఫ్ ఆశ‌లు స‌జీవం

ఈ ఐపీఎల్ సీజ‌న్ ప్రారంభంలో వ‌రుస ఓట‌ముల‌తో నిరుత్సాహ‌ప‌రిచిన బెంగ‌ళూరు, ఇప్పుడు అనూహ్యంగా పుంజుకొంది. వ‌రుస‌గా ఐదు మ్యాచ్‌లు గెలిచి, ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. ఆదివారం దిల్లీపై 47 ప‌రుగుల తేడాతో...

ఇన్ని ఫేకులా ? – కాడి దించేసిన వైసీపీ !

ప్రచారం ముగిసిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా ఓవర్ టైం వర్క్ చేసింది. చంద్రబాబు ఫేక్ వీడియోలు పెట్టుకుని గంటకొకటి చొప్పున రిలీజ్ చేస్తూ పోయింది. ఓ సారి రిజర్వేషన్ల మీద..మరోసారి పథకాల...

మీడియా వాచ్ : టీవీ9 మహాపతనం

ఒళ్లు అమ్ముకునేవాళ్లైనా కొన్ని రూల్స్ పెట్టుకుంటారేమో కానీ.. టీవీ9కి మాత్రం ఎలాంటి నైతిక విలువలు .. మీడియా రూల్స్ పెట్టుకోలేదు. నిర్భయంగా ఫేక్‌ వార్తలు ప్రసారం చేసేసింది. చంద్రబాబు వాయిస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close