బీజేపీతో టీడీపీ – ఢిల్లీలో ఏం జరుగుతోందంటే ?

తెలుగుదేశం , బీజేపీ మధ్య గత కొద్ది రోజులుగా ఏదో కెమిస్ట్రీ వర్కవుట్ అవుతోంది. అదేమిటన్నది చాలా మంది అర్థం కావడం లేదు. మాట కంటే ముందు టీడీపీని విమర్శించే జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్లంతా వరుసగా తెరపైకి వస్తున్నారు. కానీ చంద్రబాబును విమర్శించడం లేదు. కానీ సందర్భం వచ్చినప్పుడల్లా పొగుడుతున్నారు. వీరి మాటల్లో ఎంత స్పష్టమైన తేడా వచ్చిందంటే.. చంద్రబాబు ఐదేళ్లలో రాజధాని నిర్మింలేకపోయారని.. తామిచ్చిన ఏడున్నర వేల కోట్లు ఏం చేశారో చెప్పాలని వాదించే ఈ ముగ్గురూ.. ఇప్పుడు.. చంద్రబాబు దార్శనికులు.. అమరావతికి ఓ రూపం తెచ్చారని అంటున్నారు.

చంద్రబాబుపై బీజేపీ నేతల్లో పాత అభిమానం !

ఏపీ నేతల్లో మారిన వాయిస్‌కు తోడు.. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు కూడా స్పష్టమైన మార్పును చూపిస్తున్నాయి. బీజేపీ హైకమాండ్‌లో మోదీ, అమిత్ షాలు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంటారు. పాత బీజేపీ నేతలు చంద్రబాబుకు అనుకూలంగా ఉంటాయి. వాజ్ పేయి కాలంలో కీలక పాత్ర పోషించిన వారికి చంద్రబాబు .. బీజేపీకి చేసిన మేలేంటో తెలుసు. అందుకే వారు చంద్రబాబుపై ప్రత్యేక అభిమానం చూపిస్తారు. కానీ మోదీ, షాలు ఇటీవలి కాలంలో వరకూ చూపించలేదు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. గత ఎన్నికలకు ముందు నాటి పరిస్థితుల్ని వారు అవసరం కోసం అయినా మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. ఆ విషయం స్పష్టమైంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రత్యేకంగా మోదీతో భేటీ అయితే సీన్ మొత్తం మారిపోతుంది.

జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు వేలు పెట్టకపోవచ్చు !

ఇప్పటి వరకూ ఢిల్లీలో జగన్ బలం చంద్రబాబే. చంద్రబాబును ఏపీలో రాజకీయంగా బలపడితే.. బీజేపీకి..మోదీకి వ్యతిరేకంగా బలమైన శక్తి ఏర్పడుతందని.. అలా కాకుండా ఉండాలంటే.. తమకే మద్దతివ్వాలన్న ఓ అప్రకటిత ఒత్తిడి వైసీపీ వైపు నుంచి బీజేపీ మీద ఉంది. విపక్షాలను కూడగట్టగలగిన రాజకీయ చాతుర్యం చంద్రబాబుకు ఉంది. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనల ద్వారా వచ్చిన అవకాశాన్ని పక్కాగా ఉపయోగించుకుని తానిక.. ఢిల్లీ రాజకీయాల వైపు చూడనని చెప్పి ఉంటారని భావిస్తున్నారు. అంటే.. వైసీపీకి ప్రధానమైన అస్త్రాన్ని ఆయన దూరం చేసి ఉంటారని అంచనా.

బీజేపీ మిత్రుడు కాకపోయినా పర్వాలేదు.. శత్రువు మాత్రం కాకూడదు !

బీజేపీ మిత్రుడవకపోయినా పర్వాలేదు.. శత్రువు కాకుండా ఉంటే చాలనేది టీడీపీ, చంద్రబాబు భావన. న్యూట్రల్‌గా ఉండేలా ఉంటే చాలని.. తమ పని తము చేసుకుపోతామని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. బిల్ గేట్స్ లాంటి దిగ్గజాన్ని చంద్రబాబు ఐదు నిమిషాల భేటీలో మనసు మార్చుకునేలా చేశారు. అలాంటిది.. రాజకీయంగా మోదీ మనసులో ఉన్న అనుమానాల్ని పటాపంచలు చేయడంలో విఫలమవుతారని రాజకీయవర్గాలు అనుకోవడం లేదు. ఎందుకే ఏపీ రాజకీయాల్లో కీలకమైన మార్పు కనిపిస్తోందని చెప్పక తప్పదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ ల్యాండ్ చుట్టూనే తిరుగుతున్న మల్లారెడ్డి

తనకు ఐదు వందల ఎకరాలు ఉన్నాయని తనకు ఎవరి భూమి కబ్జా చేయాల్సిన పనే లేదని మల్లారెడ్డి తరచూ చెబుతూంటారు. కానీ ఓ స్థలం విషయంలో మాత్రం ఆయన నేరుగా రంగంలోకి...

సీఎస్‌ను తప్పిస్తే మొత్తం సెట్ రైట్ – ఎందుకు మార్చరు ?

ఏపీలో జరుగుతున్న సర్వ అవకతవకలకు కారణం చీఫ్ సెక్రటరీ. జగన్ రెడ్డి జేబులో మనిషిగా వ్యవహరిస్తూ వ్యవస్థలన్నింటినీ భ్రష్టుప్టటిస్తున్నారు. చివరికి అల్లర్లపై విచారణ చేయడానికి సిట్ అధికారులుగా ఏసీబీ వాళ్లను..సీఐడీలో పని...

ఏబీవీపై అవే కుట్రలు – భస్మాసుర సివిల్ సర్వీస్ ఆఫీసర్లు !

మీరు ఏది చేస్తే మీకు అది తిరిగి వస్తుందని గీత చెబుతోంది. చాలా మంది అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయి.. తర్వాత అలాంటివే తమకు జరుగుతూంటే.. గగ్గోలు పెడుతూంటారు.కానీ ఎవరి సానుభూతి రాదు. చరిత్రలో...

మౌనంగా విజయసాయిరెడ్డి – ఆడిటింగ్‌లోఉన్నారా ?

జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విదేశాలకు వెళ్లినా విజయసాయిరెడ్డి కూడా వెళతారు. అయితే జగన్ వెళ్లిన దేశానికి కాదు. వేరే దేశాలకు వెళ్తారు. ఈ లింక్ ఏమిటో తెలియదు కానీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close