రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదిస్తే ఉపఎన్నిక – నాన్చితే ముందస్తు !

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తానని ప్రకటించారు. స్పీకర్‌ను నేరుగా కలిసి లేఖ ఇస్తానంటున్నారు. అయితే ఆయనకు ఇంత వరకూ స్పీకర్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. స్పీకర్‌తో పని లేదు. ఆయన కార్యాలయంలో ఇచ్చినా ఆమోదిస్తారు. అయితే అది ఆమోదించదల్చుకుంటేనే. ఈటల విషయంలో జరిగింది అదే. స్పీకర్ కార్యాలయంలో ఇస్తే అరగంటలో ఆమోదించి.. గంటలో గెజిట్ జారీ చేశారు. కానీ రాజగోపాల్ రెడ్డి విషయంలో మాత్రం ఆ వేగం కనిపించడం లేదు.

రాజీనామాపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీ ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం ఉంటుంది. ఉప ఎన్నికకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నట్లయితే వెంటనే స్పీకర్ నుంచి ఆమోదం రావచ్చని, లేనిపక్షంలో పెండింగ్‌లో పడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ జరిగే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలవాలని కోరుకున్నా, గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నా వెంటనే స్పీకర్ నుంచి సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కానీ అలాంటి సూచనలు ఇప్పటి వరకూ కనిపించలేదు.

లేఖ ఇచ్చినా స్పీకర్ వెంటనే ఆమోదం తెలపకపోవచ్చనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం మునుగోడుకు మాత్రమే ఉప ఎన్నిక వస్తుందా లేక ముందస్తుగా అసెంబ్లీని రద్దు చేసి ఒకేసారి రాష్ట్రమంతా నిర్వహించాలనే దిశగా టీఆర్ఎస్ ఆలోచన చేస్తుందా? అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇన్ని టెన్షన్లు ఎందుకు నేరుగా ప్రజాప్రాయం కోరుకుందామని సీఎం అనుకుంటే అదే జరుగుతుంది. ఈ నెల నుంచి ఒక్క సారిగా పది లక్షల మందికిపెన్షన్లు ప్రకటించడంతో పాటు మరికొన్ని నిర్ణయాలు కేసీఆర్ తీసుకోబోతూండటంతో.. కీలక నిర్ణయాలు ఉంటాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close