కేసీఆర్ కన్నా మేఘానే టార్గెట్ చేస్తున్న షర్మిల!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర వాయిదా వేసుకుని మరీ గవర్నర్ తమిళిసైను కలిశారు. ఓ పెద్ద ఫైల్ తీసుకెళ్లారు. అందతా కాళేశ్వరంలో జరిగిన అవినీతి అని.. గవర్నర్‌కు ఆధారాలిచ్చామని చెప్పారు. అవన్నీ కాళేశ్వరరం కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి అవినీతి వ్యవహారమని చెబుతున్నారు. చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని ఆమె చెబుతున్నారు. మేఘా కృష్ణారెడ్డిని ఆమె టార్గెట్ చేయడం ఇదే మొదటి సారి కాదు. గత రెండు నెలలుగా ఇదే పరిస్థితి. ఏ సందర్బం వచ్చినా ఇదే విధంగా దాడి చేస్తున్నారు.

మేఘా కృష్ణారెడ్డి పదమూడు వేల కోట్ల పన్నులు ఎగ్గొట్టారని ఐటీ ఇంటలిజెన్స్ నివేదిక ఇచ్చిందని ప్రకటించారు. కాళేశ్వరం కూడా మేఘా వల్లే మునిగిపోయిందన్నారు. ఇలా ప్రతి అంశంలోనూ మేఘా నే టార్గెట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇటీవలి కాలంలో కేసీఆర్ కన్నా ఆమె ఎక్కువగా మేఘా కృష్ణారెడ్డినే ప్రత్యర్థిగా చూస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారన్నది కొంతమందికి అర్థం కావడం లేదు. మేఘా కృష్ణారెడ్డి .. ఇద్దరు పాలకులకు ఎంతో ఆప్తులు. రివర్స్ టెండర్లలో ఏపీలో అన్ని చోట్లా మేఘానే కాంట్రాక్టులు దక్కించుకుంది.

ఇప్పుడు మేఘానే ఎందుకు షర్మిల టార్గెట్ చేస్తున్నారంటే.. దాని వెనుక రాజకీయం ఉందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. రాజకీయం అంటే చిన్న విషయం కాదు. ఖర్చుతో కూడుకున్నది. పైగా షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. మేఘాను టార్గెట్ చేస్తే పార్టీ ఫండ్ వస్తుందన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని భావిస్తున్నారు. అయితే మేఘా వైపు నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో విపరీతంగా ఆరోపణలు చేస్తున్నారని.. ఫిర్యాదులు చేస్తున్నారని అంటున్నారు. నిజమేమిటో కానీ.. రాజకీయాల్లో ఎవరినైనా ప్రత్యేకంగా టార్గెట్ చేస్తే ఇలాంటి అనుమానాలే వస్తూ ఉంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close