గోరంట్లపై ఆంధ్రజ్యోతి ఆర్కే రూ. పది కోట్ల దావా !

గోరంట్ల మాధవ్ పై రూ. పది కోట్ల పరువు నష్టం దావా వేయాలని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్ణయించుకున్నారు. ముందుగా క్షమాపణ చెప్పాలని ఆయన నోటీసు పంపనున్నారు. గడువులోపు స్పందన రాకోపతే పది కోట్లకు దావా వేయనున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన న్యూడ్ వీడియో వ్యవహారంలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను ఎంపీ గోరంట్ మాధవ్ బూతులు తిట్టాడు. సభ్య సమాజం తలదించుకునేలా మాధవ్ మాటలు ఉన్నాయి. దీంతో ఆయనను ఉపేక్షించకూడదని ఆర్కే నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.

ఇప్పటికే ఆ వీడియో ఫేక్ అంటూ కొంత మంది టీడీపీ నేతలపై గోరంట్ల మాదవ్ ఆరోపణలు చేశారు. ఆయన చింతకాయల విజయ్ పేరు చెప్పడంతో రూ. యాభై లక్షల పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆర్కే కూడా ఈ జాబితాలో చేరుతున్నారు. ఆ వీడియో ఎంపీ మాధవ్‌ది కాదని ఎవరూ అనుకోవడం లేదు. అందరూ నమ్ముతున్నారు. అియతే అలాంటి వీడియోను కూడా తప్పు అని పోలీసులతో చెప్పించి.. మాధవ్‌ను వెనకేసుకు రావడం.. ఆయన మరింత దారుణంగా బూతులతో రెచ్చిపోవడంపై ఎలా స్పందించాలో కూడా అర్థం కాని పరిస్థితికి ప్రజలు వెళ్లిపోతున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి బూతులే అస్త్రంగా బతికేస్తోంది. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై బూతులతో విరుచుకుపడుతున్నారు. మానసికంగా బలహీనంగా ఉన్న వారు కుంగిపోతున్నారు. మిగిలిన వారు తిరిగి తిడుతున్నారు. తమను తిట్టిన వారిపై కేసులు పెడుతున్నారు.. కానీ తాము మాత్రం దారుణంగా తిట్టించడానికి వెనుకాడటం లేదు. ఇప్పుడు న్యాయస్థానాలకు ఆ తిట్ల వ్యవహారం చేరబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close