ఇండిపెండెన్స్ డే స్పీచ్‌లోనూ కేంద్రంపై కేసీఆర్ విమర్శలు !

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇండిపెండెన్స్ డే వేడుకల సందర్భంగా జాతీయ పతాకం ఆవిష్కరించిన తర్వాత చేసిన ప్రసంగంలోనూ కేంద్రంపై విమర్శలు చేశారు. స్పీచ్ చాలా వరకూ రాజకీయాంశాల జోలికి వెళ్లలేదు. కానీ చివరిలో కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అన్యాయం చేస్ోతందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం మొండి చేయి చూపిస్తోందంటూ మండిపడ్డారు.

అలాగే ఢిల్లీ రైతుల ఉద్యమం గురించీ ప్రస్తావించారు. రైతుల ఉద్యమంతో కేంద్రం రైతు నల్ల చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. టాక్సుల పేరిట జనాన్ని దోచుకుంటోందని విమర్శించారు. చిన్న పిల్లలు తాగే పాలు, స్మశాన వాటిక నిర్మాణంపై కేంద్రం ఎడాపెడా పన్నులు వేస్తోందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉచితాలపై కేంద్రం రాష్ట్రాలను అవమనిస్తోందన్నారు. కేంద్రం తీరు వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడిందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలన్నీ ఎప్పుడు మీడియాతో మాట్లాడినా చేసేవే. అయితే ఈ సారి ఇండిపెండెన్స్ డే వేడుకల్లోనూ అవే ఆరోపణలు చేయం చర్చనీయాంశమవుతోంది.

సాధారణంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాజిటివ్ స్పీచ్‌లు ఉంటాయి. ఒక వేళ ఇబ్బంది అనిపిస్తే ప్రస్తావించడం మానేస్తారు… కానీ రాజకీయాలు పెద్దగా చేయరు. కానీ కేసీఆర్ మాత్రం కేంద్రం అన్యాయాన్ని ఈ వేడుక సాక్షిగా వెల్లడించాచారు. దీనిపై సోషల్ మీడియాలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close