అవినీతి విపక్ష నేతలు మాత్రమే చేస్తారా !?

ఎర్రకోట పై నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రసంగంలో రాజకీయ వారసత్వాన్ని.. అవినీతిని అంతమొందిస్తానని మీ ఆశీర్వాదం కావాలని ప్రజలను కోరారు. అయితే రాజకీయ వారసత్వం సంగతేమో కానీ అవినీతి అంశంపై మాత్రం రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ప్రధానిగా తొమ్మిదో సారి జాతీయ జెండా ఎగురవేశారు ప్రధానమంత్రి మోదీ. మొదటి సారి జెండా ఎగురవేయడానికి.. ఇప్పుడు జెండా ఎగురవేయడానికి మధ్య ఉన్న కాలంలో అవినీతి అంతానికి ప్రధాని మోదీ ఏం చేశారో చెప్పాల్సి ఉంది.

నిజానికి కేంద్రం చేస్తున్న అవినీతి పోరాటం ప్రజలకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఎనిమిదేళ్లుగా త్రివిధ దళాల పేరుతో సీబీఐ, ఐటీ, ఈడీలతో విపక్ష నేతలపై దాడులు చేయించి.. వారితో పార్టీలు మార్పించి.. ప్రభుత్వాలను కూలగొట్టడం తప్ప.. నిజంగా అవినీతి పరులపై తీసుకున్న చర్యలేవీ లేవు. కాంగ్రెస్ నుంచి వచ్చిన చేరిన హిమంత బిశ్వశర్మ అనే నేత కేసులను పట్టించుకోకపోవడమే కాదు ఏకంగా సీఎం పదవి కూడా ఇచ్చారు. బీజేపీలో చేరిన ఒక్కరిపైనా కేసులు ముందుకు సాగడం లేదు.

బీజేపీలో చేరకపోయినా పర్వాలేదు.. బీజేపీ సానుభూతిపరులైతే చాలు వాళ్లకు కేసుల నుంచి రక్షణ లభిస్తున్న అంశం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అదే బీజేపీని వ్యతిరేకించినా… వ్యతిరేకించే పార్టీలో ఉన్నా.. ఆ మూడు దర్యాప్తు సంస్థలకు టార్గెట్ అయినట్లే. ఇది అవినీతిని నిర్మూలించడం అని ఎవరూ అనుకోరు. కానీ ప్రధానమంత్రి మాత్రం .. తాను అదే పనిలో ఉన్నానని చెబుతున్నారు. దేశ ప్రజలకు మాత్రం ఆ మాటల్లో అంత నిజాయితీ కనిపించలేదు. ఎందుకంటే కళ్ల ముందు జరుగుతున్న వ్యవహారాలు ఆ తీరుగానే ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close