బాధితులే లేని కేసులో ఐదుగుర్ని అరెస్ట్ చేసిన ఏపీసీఐడీ !

అమరావతి రైతులు అలా పాదయాత్ర ప్రారంభించగానే ఇలా ప్రభుత్వం కుట్రల మీద కుట్రలు ప్రారంభించింది. ఓ వైపు ఉత్తరాంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూ.. మరో వైపు షెడ్డుకెళ్లిపోయిన కేసుల్లో కొంత మందిని అరెస్ట్ చేస్తోంది. మరో వైపు కార్పొరేషన్ ప్రజాభిప్రాయసేకరణ అంటూ హడావుడి చేస్తున్నారు. రాజధాని అసైన్డ్ భూముల్లో అక్రమాలని ఎమ్మెల్యే ఆళ్ల రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసిన పోలీసులకు.. తము బాధితులమంటూ ఒక్కరు కూడా రాలేదు. అయినా సరే విచారణ జరిపి ఇప్పుడు ఐదుగుర్ని అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు.

అసలు తమ భూములు తమ దగ్గరే ఉన్నాయని ఎవరికీ అమ్మలేదని ఆ దళిత రైతులు చెబుతున్నారు. కానీ సీఐడీ అధికారులు మాత్రం మీరు నారాయణ … బినామీలకు అమ్మేశారని తేల్చేసి కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనుకున్న వాళ్లని చేసేశారు. పదకొండు వంద ఎకరాల అసైన్డ్ భూములు చేతులు మారాయని సీఐడీ అధికారులు చెబుతున్నారు. కానీ ఎక్కడా అలాంటి లావాదేవీలు లేవని గతంలోనే తేలింది. అయితే ఇప్పుడు కొత్తగా సీఐడీ అధికారులు అరెస్టులు చేసి కొత్తగా ఏదో చేసేశామని ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు.

ఇంత ప్రభుత్వ యంత్రాంగం ఉన్నా.. పోలీసులు, సీఐడీ వచ్చి వేధిస్తున్నా ఒక్క దళిత రైతు కూడా తమ భూములు అక్రమంగా లాక్కున్నారని చెప్పడం లేదని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వారు కూడా తాము ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని … వారి వీడియోలను టీడీపీ అప్పట్లోనే టీడీపీ విడుదల చేసింది. కక్షతో కళ్లు మూసుకుపోయిన ప్రభుత్వం సీఐడీ లాంటి వ్యవస్థల్ని ఉపయోగించకుని నేరాలకు పాల్పడుతోందని ఎప్పటికైనా పాపం పండక తప్పదని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

‘విద్య వాసుల అహం’ రివ్యూ: మ‌ళ్లీ పాత పెళ్లి కథే!

తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' ప్రతి వారం ఎదో ఒక కొత్త సినిమా ఉండేలా ప్లాన్ చేస్తుకుంటుంది. ఈ వారం రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ నటించిన 'విద్య వాసుల అహం' ప్రేక్షకులు...

కడప కోర్టు తీర్పు రాజ్యాంగవిరుద్ధంగా ఉందన్న సుప్రీంకోర్టు

వివేకా హత్యపై మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మండిపడింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని స్పష్టం...

కౌంటింగ్‌లో సహకరించాలన్నట్లుగా ఈసీని బెదిరిస్తున్న సజ్జల !

అయిందేదో అయిపోయింది.. ఇక తప్పు దిద్దుకో అని ఈసీని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈసీ ఏం తప్పు చేసిందో.. ఎలా దిద్దుకోవాలనుకుంటున్నారో ఆయన పరోక్షంగానే తన మాటలతో సందేశం పంపారు. అదేమిటంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close