మిడిల్ డ్రాప్ … దసరాకు కేసీఆర్ జాతీయ పార్టీ లేనట్లే !

ఇతర రాష్ట్రాల నుంచి సీనియర్ నతలు వస్తున్నారు. కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం అని పొగుడుతున్నారు. వెళ్తున్నారు. ఇక టీఆర్ఎస్ నేతల సంగతి చెప్పాల్సిన పని లేదు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని కోరస్‌గా చెబుతున్నారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులంతా అర్జంట్‌గా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోవాలని తీర్మానం చేశారు. కేసీఆర్ కూడా ప్రగతి భవన్ వేదికగానే దాదాపుగా కసరత్తు పూర్తి చేశారు. ఇక ప్రకటనే తరువాయి అనుకుంటున్న సమయంలో .. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.

దసరాకు పార్టీ ప్రకటన ఉంటుందని ఎక్కువ మంది నమ్మారు. కానీ ఎలాంటి పార్టీ ప్రకటన ఉండటం లేదని టీఆర్ఎస్ వర్గాలు ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో ఏదీ కలసి రాకపోవడంతో పాటు ఇటీవలి కాలంలో దర్యాప్తు సంస్థల దూకుడు ఎక్కువైపోయింది. రాష్ట్రంలో అవినీతిపై ఏదైనా కేసులు పెడితే కక్ష సాధింపు.. తెలంగాణ ఆత్మ గౌరవం పేరుతో ప్రజల్లోకి వెళ్లవచ్చు కానీ… ఢిల్లీ లిక్కర్ కేసుల్లో ఇప్పుడు తెలంగాణ నేతలు ఇరుక్కున్నారు. స్వయంగా కేసీఆర్ పేరు వినిపిస్తోంది. ఓ ఆడిటర్‌పై ఈడీ అధికారులు నిర్వహించిన సోదాల్లో చాలా మంది టీఆర్ఎస్ నేతల హవాలా దందా బయటపడినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఇక జాతీయ రాజకీయాలలలో ధర్డ్ ఫ్రంట్ అంటూ ఉండదని … ఉండేది కాంగ్రెస్ కూటమేనని కేసీఆర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న నితీష్ కుమార్ కూడా క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్ నాయకత్వం కోసం దేశం ఎదురు చూస్తోందని.. ఆయన సేవలు దేశానికి ఎంతో అవసరం అని ప్రకటించిన ఎవరూ ..ఢిల్లీలో ఆయనతో కలిసి నడిచేందుకు ముందుకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికే ఎంత కసరత్తు చేసినా అనుకున్న విధంగా హైప్ రాకపోవడం.. ఇప్పుడు తెలంగాణను వదిలేసి ఢిల్లీ వెళ్తే.. మొదటికే మోసం వస్తుందన్న అంచనాతో కేసీఆర్ .. జాతీయ పార్టీ విషయాన్ని ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close