దసరా రోజు కేసీఆర్ జాతీయ పార్టీ పేరు ప్రకటన !

పరిస్థితులు కలిసి రాకపోయినా ముందుకే వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో భారీ బహిరంగసభ పెట్టి పార్టీ ప్రకటన చేయాలనుకున్న ఆయనకు ఏదీ కలసి రావడం లేదు. దీంతో మంచి రోజు అని విజయదశమి రోజున పార్టీ పేరు మాత్రం ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు దసరా రోజు మధ్యాహ్నం 1.19 నిమిషాలకు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయాలని పండితులతో ముహుర్తం ఖరారు చేయించుకున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

అదే రోజున టీఆర్ఎస్ఎల్పీ భేటీ నిర్వహిస్తారు. అందరి ఆమోదంతో జాతీయ పార్టీ ప్రకటించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఏకాభిప్రాయం మేరకు… పార్టీ ప్రకటన ఉంటుంది. ఇప్పటికే టీఆర్ఎస్ జిల్లా పార్టీల అధ్యక్షులు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని స్వయంగా తీర్మానాలు చేశారు. ఇప్పటికే పలువురు మంత్రులు కీలక నేతలు.., కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని ప్రకటనలు చేస్తున్నారు. గతంలో జాతీయ నేతలందర్నీ పిలిచి కనీ వినీ ఎరుగని రీతిలో బహిరంగసభ నిర్వహించి జాతీయ పార్టీ ప్రకటన చేయాలనుకున్నారు కేసీఆర్. అయితే ఈ సారి పార్టీ పరమైన ప్రకటన మాత్రం ముహుర్తం ప్రకారం చేసి ఆ తర్వాత బహిరంగసభ నిర్వహించాలని ఆలోచిస్తున్నారు.

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ముందుగా ప్రాంతీయ పార్టీలన్నింటితో కూటమి కట్టడం ద్వారా ఆయన ఢిల్లీ రాజకీయాలు చేయాలనుకున్నారు. కానీ ప్రాంతీయ పార్టీల నేతలు తమ తమ రాష్ట్రాల్లో.. తమ పార్టీల ప్రయోజనాల పరంగా చూసుకుని ఎక్కువగా జాతీయ పార్టీలతో కలిసేందుకే మొగ్గు చూపుతున్నాయి. దీంతో కేసీఆర్ రైతు సంఘాల నాయకులతను రాజకీయాల్లోకి తెచ్చి .. జాతీయ పార్టీ ప్రకటన చేయాలని అనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అందర్నీ గొడ్డలితో నరికేసి సింగిల్ ప్లేయర్ అవ్వండి – భారతికి షర్మిల సలహా

వైఎస్ జగన్, ఆయన సతీమణిపై వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బధవారం మీడియాతో మాట్లాడిన షర్మిల వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి... వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ...

విజ‌య్ సినిమాల‌కు టైటిళ్లు కావ‌లెను!

రేపు.. అంటే మే 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా విజయ్ కొత్త సినిమాల సంగ‌తులు రేపే రివీల్ కాబోతున్నాయి. మైత్రీ మూవీస్ లో విజ‌య్ ఓ సినిమా చేస్తున్నాడు....

మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో మోడీ..!?

ఇన్నాళ్ళు పదునైన విమర్శలతో కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టేసిన ప్రధాని మోడీ మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో పడినట్లుగా కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల ప్రచార సభలో రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తుండటంతో మోడీ కాంగ్రెస్...

‘మిరాయ్’ నుంచి మ‌రో స‌ర్‌ప్రైజ్‌

'హ‌నుమాన్‌' త‌ర‌వాత తేజా స‌జ్జా నుంచి వ‌స్తున్న సినిమా 'మిరాయ్‌'. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవ‌లే టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌లోని షాట్స్,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close