శ్రీవారి అర్చకుల్లోనూ చిచ్చు పెట్టేశారు !

ఏపీలో ఒకరికొకరు కొట్టుకుని..తిట్టుకునేందుకు రాజకీయాలు పెడుతున్న చిచ్చు ఇప్పుడు శ్రీవారి అర్చకుల మధ్య కూడా ప్రారంభమయింది. అర్చక వ్యవస్థ, శ్రీవారి ఆలయం నాశనమయ్యే లోపు ‘వన్‌ మ్యాన్‌ కమిటీ నివేదిక’ను టిటిడిలో అమలు చేయాల్సిన అవసరం ఉందని రమణదీక్షితులు బుధవారం మధ్యాహ్నం ట్వీట్‌ చేశారు. జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వన్ మ్యాన్ కమిటీ నివేదికతో .. ఆలయ బాధ్యతలు మళ్లీ తన చేతికి వస్తాయని రమణదీక్షితులు ఆశిస్తున్నారు. కానీ సీఎం జగన్ రమణదీక్షితుల కోరికను పట్టించుకోవడం లేదు.

రమణదీక్షితుల ట్వీట్‌పై స్పందించాలని ప్రస్తుత ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులపై ఒత్తిడి రావడంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. తిరుమలలో అర్చక వ్యవస్థ సవ్యంగా, సంతృప్తికరంగా ఉందన్నారు. సిఎం జగన్‌తో తమ నాలుగు కుటుంబాల అర్చకులు సమావేశమయ్యామని, 142 సెక్షన్‌ ప్రకారం 1997లో తమను పర్మినెంట్‌ చేశారనీ, తమ పిల్లలు కూడా స్వామివారి సేవ చేసుకునే అవకాశం కల్పించారని తెలిపారు. 1997లో కమిటీ రిపోర్ట్‌ ప్రకారం మిరాశీదారులను ఉద్యోగస్తులుగా తీసుకున్నారనీ, అప్పటి నుంచి అర్చకులు సంభావన అర్చకులుగా పని చేస్తున్నారని చెప్పారు. జిఒ నం.855 ప్రకారం తమ సర్వీసును 2018లో రెగ్యులరైజ్‌ చేశారని తెలిపారు.

సెక్షన్‌ 142 ప్రకారం తమకు గౌరవ మర్యాదలు అందుతున్నాయనీ, తమ కుటుంబంలోని పిల్లలకు 142 సెక్షన్‌ అమలు చేయాలని సిఎం జగన్‌ను కోరామనీ, దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. అర్చక వ్యవస్థను అర్చకేతరులు నాశనం చేస్తున్నారని ఆరోపిస్తున్న రమణ దీక్షతులకే వాళ్లు ఎవరో తెలియాలన్నారు. రమణ దీక్షతులకు కూడా సెక్షన్‌ 142 ప్రకారం అన్ని గౌరవ మర్యాదలు అందుతున్నాయని తెలిపారు. పింక్ డైమండ్ ఆరోపణలతో నిక్షేపంలా ఉన్న తన పదవికి ఎసరు తెచ్చుకున్న రమణదీక్షితులు ఇప్పుడు ఆ పదవి కోసం ఒత్తిడి చేస్తూంటే.. ఆయనపైనే ఎదురుదాడి చేయిస్తున్నారు. మొత్తంగా నష్టంపోయింది రమణదీక్షితులే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close