మనకు జీతం పదివేలు వస్తే.. క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని రూ. ఇరవై వేలు ఖర్చు పెట్టేస్తే ఏమవుతుంది ? ఖర్చు పెట్టినప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే క్రిడెట్ లిమిట్ అయిపోతుందో అప్పుడే అసలు సినిమా ప్రారంభమవుతుంది. క్రెడిట్ లిమిట్ ఉన్నంత కాలం కన్నూమిన్నూ కానరాదు. ఇప్పుడు ఏపీ పరిస్థితి కూడా అంతే. ఏపీ ప్రభుత్వం నాలుగు నెలల్లో చేసిన ఆదాయం.. ఖర్చుల వివరాలను కాగ్ వెల్లడించింది.
కాగ్ లెక్కల ప్రకారం తాజా ఆర్థిక సంవత్సరంలో తొలి నాలుగు నెలలు గడిచేసరికి ఆదాయం కన్నా రెట్టింపు ఖర్చు పెట్టేశారు. నాలుగు నెలల్లో రూ.45,575 కోట్లు ఆదాయంగా వచ్చంది. ఇదే సమయంలో వ్యయం మాత్రం ఏకంగా రూ.86,281 కోట్లుగా నమోదైంది. మొత్తం బడ్జెట్ అంచనాలో ఇది 36.11 శాతంగా ఉంది. ఆదాయ లోటు బడ్జెట్ అంచనాకన్నా రెట్టిరపునకు పైగా నమోదైరది. బడ్జెట్లో రూ.17,036 కోట్లుగా అంచనా వేయగా, తొలి నాలుగు నెలల్లోనే ఏకంగా రూ.37,849 కోట్లకు చేరిపోయింది. అరటే 220 శాతం లోటుగా ఉందని కాగ్ పేర్కొంది. ద్రవ్య లోటు కూడా అదే స్థాయిలో ఉంది. బడ్జెట్లో రూ.48,724 కోట్లుగా అంచనా వేయగా, నాలుగు నెలల్లోనే రూ.42,181 కోట్లకు చేరిపోయింది.
లోటు మొత్తాన్ని అప్పులతో భర్తీ చేస్తున్నారు. నాలుగైదు నెలల్లోనే ఏడాది మొత్తంలో చేయాల్సిన అప్పును చేసేశారు. ఇప్పుడు కేంద్రం అదనపు అప్పులకు అనుమతి ఇవ్వకపోతే అసలు కష్టాలు ప్రారంభమవుతాయి. అదనపు ఇప్పులకు అనుమతి ఇచ్చినా తాత్కలిక అవసరాలే తీరుతాయి కానీ అప్పులు తీరవు. ఆదాయం పెరగదు. ఎందుకంటే.. చేస్తున్న వ్యయంలో పెట్టుబడి వ్యయం పది శాతం కూడా ఉండటం లేదు.