విద్యావ్యవస్థ విచ్చిన్నం – బడికి లక్షల మంది పిల్లలు దూరం !

ఏపీలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు సంఖ్య ఈ ఏడాది భారీగా పడిపోయింది. ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా సగానికి సగం మంది తగ్గారు. 2021-22 విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను ప్రస్తుత విద్యా సంవత్సరంతో పోలిస్తే ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో కలిపి ఐదున్నర లక్షల మంది విద్యార్థులు బడికి దూరమయ్యారని తేలింది. ప్రభుత్వం అధికారికంగా లెక్కలు విడుదలచేయలేదు. కానీ ఉపాధ్యాయ సంఘాలు మాత్రం అసలు విషయాన్ని బహిరంగంగానే ప్రకటిస్తున్నాయి. వీటికి కారణం ప్రధానంగా రెండే. ఒకటి పాఠశాలల్ని విలీనం చేయడం.. రెండు ఇంగ్లిష్ మీడియం.

ప్రభుత్వం విద్యా శాఖలో కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇటీవల పాఠశాలల్ని విలీనం చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో దూరాభారం అవడం వల్ల చాలా మంది బడి మానేశారు. మరి కొంత మంది సమీపంలోని ప్రైవేటు స్కూళ్లలో చేరిపోయారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం మొత్తం ఇంగ్లిష్ మీడియంను అమలు చేయడం ప్రారంభించింది. చట్ట ప్రకారంగా తెలుగు మీడియా కూడా నిర్వహించాల్సి ఉంది. కానీ తెలుగు మీడియంను అనధికారికంగా నిలిపివేశారు. ఇంగ్లిష్ మీడియంలోనే బలవంతంగా చేర్పించేశారు. ఈ కారణంగా లక్షల్లో డ్రాపౌట్‌లు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.

ప్రభుత్వ స్కూళ్ల మీద … పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారు. వేల కోట్లతో పథకాలు అమలు చేస్తున్నారు. నాడు – నేడు పేరుతోనూ వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరగాలి. కానీ తగ్గితే ప్రభుత్వ కృషి ఫలించనట్లే. నిజానికి విద్యా వ్యవస్థపై ప్రభుత్వ దృక్ఫథంతోనే పొరపాటు ఉంది. స్కూళ్లకు రంగులు వేసి .. రంగుల కుర్చీలుతెచ్చి పెట్టినంత మాత్రాన పిల్లలకు చదువు రాదని.. ముందుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందే విధంగా చూడాలి. కానీ ఆ పని చేయలేదు. ట్యాబులిస్తాం.. రంగులేయిస్తాం… అమ్మఒడి ఇస్తాం అని.. చెప్పి మొత్తానికి పేద పిల్లల చదువుపై పెద్ద బండ వేసేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close