సాక్షికి బిల్లులు చెల్లించని వాలంటీర్లు !

వాలంటీర్లందరికీ ఇటీవల ప్రభుత్వం రూ. రెండు వందల జీతం పెంచింది. ఎందుంటే ఆ డబ్బులతో న్యూస్ పేపర్ కొనుక్కుని చదవడానికి. చదువుతారో లేదో కానీ.. కొనాలి. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులిస్తోంది. ఏ పేపరో కొంటే ఊరుకుంటారా సాక్షి పేపరే కొనాలి. ఇలా డబ్బులు ఇస్తున్న వారందరి లిస్ట్ పేపర్ ఏజెంట్లకు పంపి వారికి పేపర్ వేయిస్తున్నారు. అయితే చాలామంది వాలంటీర్లు పేపర్ బిల్లు కట్టడం మానేశారు. ఆ డబ్బులు కూడా తామే వాడుకోవడం ప్రారంభించారు. దీంతో సాక్షి ఏజెంట్లకు పెద్ద చిక్కొచ్చి పడింది.

ప్రజాధనాన్ని సాక్షికి దోచి పెట్టడానికి ప్రభుత్వం ఎంచుకున్న అనేక మార్గాల్లో సాక్షి చందాను వాలంటీర్లతో కట్టించడం ఒకటి. వాలంటీర్లు డబ్బులిచ్చి కొనరు కాబట్టి.. వారికి ప్రభుత్వం రెండు వందలు ఇచ్చి సాక్షిని కొనిపిస్తున్నారు. అలా కొన్ని లక్షల సర్క్యూలేషన్ పెంచుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి దాంట్లోనూ రెండు సాక్షి పత్రికలు వేయిస్తూ మరింత పెంచుకున్నారు. ఆ డబ్బులు కూడా జనానివే. ఇక సాక్షి పత్రికకు వెళ్తున్న ప్రకటనలు వందల కోట్లే. అందరికీ బిల్లులు ఆగుతాయి కానీ.. సాక్షి పత్రికకు మాత్రం ఆగవు. ఇక సాక్షి ఉద్యోగుల్ని.. ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా మార్చి జీతాలిస్తున్న విషయం కళ్ల ముందే ఉంది.

అయితే వీరి దోపిడికి తాము సహకరిస్తున్నామని వాలంటీర్లు అనుకుంటున్నారేమో కానీ.. ఎక్కువ మంది ఆ సాక్షి పత్రిక వద్దని అంటున్నారు. అధికారికం కాదు కాబట్టి.. వాలంటీర్లు బలవంతంగా వేస్తే బిల్లు కట్టడం లేదు. దీంతో అధికారుల వైపు నుంచి సాక్షి ఏజెంట్లు ఒత్తిడి తెస్తున్నారు. బిల్లులు కట్టకపోతే జీతం కట్ చేస్తామని వాలంటీర్లను బెదిరిస్తున్నారు. పలు చోట్ల ఇలాంటివి జరుగుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close