అనిల్ రావిపూడి – బాల‌య్య‌… ముహూర్తం ఫిక్స్‌

`ఎఫ్ 3` త‌ర‌వాత అనిల్ రావిపూడి సినిమా నంద‌మూరి బాల‌కృష్ణ తో ఫిక్సయిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ.. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌లేదు. దానికి రెండు కార‌ణాలున్నాయి. ఒక‌టి.. బాల‌య్య `వీర సింహారెడ్డి`తో బిజీగా ఉన్నాడు. రెండోది.. రావిపూడి కూడా స్క్రిప్టుని పూర్తి స్థాయిలో సిద్ధం చేయ‌లేదు. బాల‌య్య‌ సెకండాఫ్‌లో…కొన్ని మార్పులు చేర్పులూ సూచించ‌డంతో ఆ ప‌నిలో బిజీగా ఉండిపోయాడు. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు స్క్రిప్టు సిద్ధమైంది. షూటింగ్‌కి కూడా ముహూర్తంది దొరికింది.

డిసెంబ‌రు 9 నుంచి… బాల‌య్య – రావిపూడి సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. బాల‌య్య కూడా 9నే.. సెట్లోకి అడుగుపెట్ట‌బోతున్నాడ‌ని టాక్‌. `వీర సింహారెడ్డి` సంక్రాంతికి విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది. రావిపూడి సినిమాలో బాల‌య్య గెట‌ప్ కూడా స‌రికొత్త‌గా ఉండ‌బోతోంద‌ని టాక్‌. ఈ సినిమా పూర్తిగా బాల‌య్య స్టైల్ లోనే యాక్ష‌న్ మోడ్ లో ఉండ‌బోతోంద‌ట‌. అయితే రావిపూడి స్టైల్ ఆఫ్ కామెడీ కూడా మిక్స్ చేశాడ‌ట‌. మొత్తానికి బాల‌య్య ఫ్యాన్స్‌కి ఈ సినిమా విందుభోజ‌నంగా తీర్చిదిద్ద‌డానికి రావిపూడి అన్ని క‌స‌ర‌త్తులూ పూర్తి చేసేశాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్కే పలుకు : మీడియా విశ్వసనీయతపై ఆర్కే ఆవేదన

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కొత్త పలుకులో తెలుగు మీడియా విశ్వసనీయత కోల్పోతోందని.. ప్రజలు ఎవరూ నమ్మలేని పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేయడానికి కేటాయించారు. చాలా కష్టపడి...

విశ్వ‌క్‌సేన్ కోసం బాల‌య్య‌

నంద‌మూరి హీరోలంటే విశ్వ‌క్‌సేన్‌కు ప్ర‌త్యేక‌మైన అభిమానం. ఎన్టీఆర్‌కు విశ్వ‌క్ వీరాభిమాని. ఎప్పుడు ఎన్టీఆర్ ప్ర‌స్తావన వ‌చ్చినా, ఊగిపోతాడు. బాల‌కృష్ణ‌తో కూడా మంచి అనుబంధ‌మే ఉంది. విశ్వ‌క్‌సేన్ గ‌త చిత్రానికి ఎన్టీఆర్ గెస్ట్ గా...
video

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ ట్రైల‌ర్‌: ఇది మ‌రో ర‌కం సినిమా

https://youtu.be/UY31pDh055o?si=kVsguDvBSdE7xJ5Y 'మాస్ కా దాస్' అనే ట్యాగ్ లైన్‌కి త‌గ్గ‌ట్టుగా సినిమాలు చేసుకొంటూ వెళ్తున్నాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న నుంచి వ‌స్తున్న మ‌రో పూర్తి స్థాయి మాస్‌, మ‌సాలా, పొలిటిక‌ల్ ధ్రిల్ల‌ర్‌... 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి'....

బీఆర్ఎస్ ను బుక్ చేసిన సీబీఐ మాజీ జేడీ..!?

ఏపీకి రాజధాని లేకపోవడంతో మరో పదేళ్లు హైదరబాద్ నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ డిమాండ్ పట్ల బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇటీవల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close