వివేకా కేసులో సీబీఐ సైలెంట్ – పులివెందుల కోర్టు యాక్టివ్ !

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎక్కడి వరకు వచ్చిందో ఎవరికీ తెలియదు. సీబీఐ బృందాలు ఏం చేస్తున్నాయో తెలియదు. విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలన్న పిటిషన్ పై తీర్పు సుప్రీంకోర్టులో రిజర్వ్‌లో ఉంది. అక్టోబర్ 21న తీర్పు చెబుతామని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది కానీ.. నెల దాటినా తీర్పు ఇంకా వెల్లడి కాలేదు. ఈ లోపు పులివెందులలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జైల్లో ఉన్న ఏ 5 నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య స్టేట్‌మెంట్‌ను పులివెందుల జడ్జి నమోదు చేశారు.

తొమ్మిదినెలల కిందట శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ పులివెందుల కోర్టులో ఓ పిటిషన్ వేశారు. అసలు వివేకాను హత్య చేసింది ఆయన కుమార్తె, అల్లుడేనని ఆరోపిస్తూ.. అసలు హత్య ఎలా జరిగింది… ఎవరెవరు ఫోన్లు మాట్లాడుకున్నారు.. ఇలాంటివి వివరిస్తూ.. ఓ పిటిషన్ వేశారు. తొమ్మిది నెలల పాటు ఆ పిటిషన్ గురించి పులివెందుల కోర్టు పట్టించుకోలేదు. అయితే హఠాత్తుగా పిలిచి.. స్టేట్‌మెంట్ నమోదు చేశారు. వివేకానందరెడ్డి రెండో పెళ్లి చేసుకుని.. ఆస్తిని వాళ్లకు రాసిస్తామని చెప్పడం వల్ల కుటుంబసభ్యులే హత్య చేశారని తులశమ్మ పిటిషన్‌లో పేర్కొన్నారు.. వాంగ్మూలం కూడా అదే ఇచ్చి ఉంటారు.

అయితే అసలు సీబీఐ విచారణలో ఉన్న కేసులో పులివెందుల కోర్టు… వెళ్లి సీబీఐకి చెప్పాలని చెప్పకుండా ఎందుకు స్టేట్‌మెంట్ రికార్డు చేసిందనేదానిపై న్యాయవర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. విచారణను ఇతర రాష్ట్రానికి తరలిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది.. తీర్పు వచ్చే దశలో ఎందుకు స్టేట్‌మెంట్ రికార్డుచేయడం ద్వారా ఏం చేయబోతున్నారన్నది కూడా సస్పెన్స్‌గా మారింది. మొత్తంగా చూస్తే.. వివేకా కేసులో బాధితుల్నే నిందితులుగా మార్చేందుకు కుట్ర ఓ రేంజ్‌లో జరుగుతోందన్న అనుమానం మాత్రం బలపడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

నిరాసక్తంగా జగన్ ప్రచారం – ఆశలు వదిలేసుకున్నట్లే !

ఏపీ సీఎం జగన్ ప్రచారానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రెండు, మూడు రోజులకో సారి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతున్నారు. ప్రచార సభల్ని పరిమితం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్...

ఒంగోలు లోక్‌సభ రివ్యూ : డబ్బుతొ గెలిచేస్తానని చెవిరెడ్డి లెక్కలు

ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్‌లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్...

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తే రేవంత్ ను ఓడించినట్లే !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల రాజకీయం రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఆయనను దెబ్బకొట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. సొంత నియోజకవర్గం అయిన మహబూబ్ నగర్ లోక్ సభలో ఓడిస్తే ఆయనకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close