కేసు కొట్టేశారు సరే..మరి సీఐడీపై చర్యలొద్దా !?

ఏపీ పోలీసులు నమోదు చేసిన రెండు కేసుల్ని హైకోర్టు కొట్టి వేసింది. ఒకటి నారా లోకేష్‌పై నమోదు చేసిన కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు కాగా.. మరొకటి సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసు. తనపై సీఐడీ అధికారులు తప్పుడు కేసు పెట్టారని అంకబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు అంకబాబు వాదనను సమర్థించి కేసును కొట్టి వేసింది. తప్పుడు కేసు పెట్టిన సీఐడీపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ?

అంకబాబు వయసు 73 ఏళ్లు. విజయవాడ ఎయిర్ పోర్టులో బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో ఓ దినపత్రికలో వచ్చిన వార్తను ఓ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశారు. అదే ఆయన చేసిన నేరం. కేసులు పెట్టడమే కాదు.. ఆయన ఇంటి గోడలు దూకి దాదాపుగా పది మందిసీఐడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.బట్టలు వేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. నోటీసులు కూడా ఇవ్వకుండా.. వయసు పరంగా వృద్ధుడైన వ్యక్తితో సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

నిజంగా తప్పు చేసి ఉంటే అనుకోవచ్చు.. కానీ ఉద్దేశపూర్వకంగా.. కక్ష సాధింపు కోసమే.. ఆయన ప్రభుత్వ పెద్దలకు ఇష్టం లేని సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఏదో ఒకటి చేయాలన్న దుర్బుద్దితోనే అరెస్ట్ చేశారని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కేసు తప్పుడదని అర్థమైపోయింది. మరి ఆయనను మానసికంగా క్షోభ పెట్టిన సీఐడీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? ప్రైవేటు కేసులు పెట్టి.బాధితులే పోరాడాలా లేకపోతే… మరోసారి ఇలాంటి వారు బాధితులు కాకుండా.. వ్యవస్థే ఏమైనా చర్యలు తీసుకుంటుందా ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close