ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని ఇంటికి పంపేసిన ఏపీ సర్కార్ !

ఉద్యోగంలో చేరి పదేళ్లు కాని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందర్నీ.. తక్షణం టెర్మినెట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాన్ఫిడెన్షియల్ అయిన ఈ జీవో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంతా చిరు ఉద్యోగులే. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, అటెండర్ల ఇలా కింది స్థాయిలో పని చేస్తున్న వారిని తక్షణం తొలగించాలని ఆ ఉత్తర్వుల్లో ఉంది. ఈ జీవోను ఎప్పటి నుండి అమలు చేస్తున్నారో స్పష్టత రావాల్సి ఉంది. ఈ మేరకు పదేళ్లలోపు సర్వీసు ఉన్న వారిని గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది. క్షేత్ర స్థాయి నుంచి సమాచారం సేకరించిన ఏ శాఖకు సంబంధించి ఆ శాఖ విడివిడిగా ఉత్తర్వులు జారీ చేయనుంది.

డిసెంబర్ 1వ తేదీన జారీ చేసిన ఆదేశాల ప్రకారం నవంబర్ 28న ప్రభుత్వం నుంచి అందిన మార్గదర్శకాల ప్రకారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవల్ని నిలిపివేయాలని ఆదేశించారు. ఈ మేరకు వేతన చెల్లింపు విబాగాలు చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఔట్ సోర్సింగ్ విధానంలో దాదాపు 2.40లక్షల మంది పనిచేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ ఇచ్చిన హామీల మేరకు ఏదొక రోజు తమ ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తారనే ఆశతో పనిచేస్తున్న ఉద్యోగులకు పూర్తిగా షాకిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికన న్యాయం చేస్తానంటూ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. పదేళ్ల సర్వీసుకు ఒక్క రోజు తక్కువైనా వారి సేవల్ని నిలిపి వేయాల్సి ఉంటుందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత దాదాపు 90వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ శాఖల్లో చేరారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల కోసం ఏకంగా ఆప్కాస్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.16వేల నుంచి రూ.23వేల లోపు వేతనాలు చెల్లిస్తున్నారు. అయితే ఈ ప్రభుత్వ వచ్చిన తర్వాత వేల మందిని నియమించుకున్నారు. సాక్షి ఉద్యోగుల్ని నియమించారు. మరి వారిని కూడా తీసేస్తారో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close