ఏపీకి ఎందుకీ ఖర్మ : ఓ వైపు జీతాలివ్వలేని దైన్యం – మరో వైపు దుబారా !

ఆంధ్రప్రదేశ్‌లో దుర్భర దారిద్ర్యం కళ్ల ముందే కనిపిస్తోంది. ప్రభుత్వానికి పనులు చేసిన వాళ్లకి బిల్లులు రావడం లేదు. ఉద్యోగం చేసిన వారికి జీతం ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. జీతం ఇవ్వండి మహా ప్రభో అని టీచర్లు కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి. ఇక తమ జీతాల్లోంచి కట్ చేసుకున్న పొదుపు సొమ్ములు ఇవ్వాలని వెంట పడుతున్నా.. ప్రభుత్వం… సంక్రాంతికి కొంచెం ఇస్తాం పండగ చేసుకోండి అని సలహా ఇస్తున్నారు. అదే సమయంలో మరో వైపు దుబారా మాత్రం ఓ రేంజ్‌లో సాగుతోంది.

బీసీ సభ ఖర్చంతా ప్రజల సొమ్మే !

విజయవాడలో వైసీపీ నేతలు నిర్వహించిన బీసీ సభ పార్టీ పరంగా చేశారా.. ప్రభుత్వ పరంగా చేశారా అన్నది సీక్రెట్‌గా ఉంచారు. అయితే పార్టీ పరంగా జరగలేదని ప్రభుత్వ పరంగానే జరిగిందన్నదానికి కొన్ని ఉదాహరణలు వెలుగు చూస్తున్నాయి. అన్ని జిల్లాల నుంచి విజయవాడకు తరలించిన పదిహేను వందలకుపైగా ఆర్టీసీ బస్సులను వైసీపీ నేతలు బుక్ చేయలేదు. దీంతో ప్రభుత్వ కార్యక్రమంగానే రాసుకుని వాటిలో జనాలను తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే మొత్తం ఖర్చు ప్రభుత్వానిదే. ఎంత లేదన్నా కనీసం పాతిక కోట్ల వరకూ ఖర్చు అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదంతా ప్రజల సొమ్మే.

రెడ్డి సలహాదార్ల విప్లవం.. అందరికీ లక్షల్లో జీతాలు !

ఇటీవలి కాలంలో సలహాదారులను ఇష్టారీతిన నియమిస్తున్నారు. ఎంతగా అంటే… ప్రతీ రోజూ సలహాదారుల నియామకం గురించి చెప్పాల్సిన అవసరం ఉందా అని మీడియా కూడా భావించేంతగా. తాజాగా వ్యవసాయ శాఖకు మరో ఇద్దరు సలహాదారులను నియమించారు. ఇద్దరూ కడప జిల్లాకు చెందిన రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే. ఇలాంటి వారు వంద దాటిపోయి ఉంటారు. వీరందరూ ఒక్కొక్కరికి.. కనీసం మూడు లక్షల వరకూ ఉంటుంది. ఇక వారి మెయిన్‌టనెన్స్ ఇతర ఖర్చుల గురించి చెప్పాల్సిన పని లేదు.

విందులు వినోదాలకు కొదవేం ఉండదు !

ఇటీవల బీసీ కుల సంఘాల నేతలకు విందులివ్వడానికి కార్పొరేషన్లకు రెండు లక్షలు విడుదల చేశారు. నిజానికి కార్పొరేషన్లకు నిధులు ఇచ్చి ఆయా కులాల యువత స్వయం ఉపాధికి సహకరించాల్సి ఉంటుంది. అలా చేయకుండా విందు భోజనం పెట్టి ఓట్లు కొట్టేసేందుకు ప్రజాధనాన్ని వినియోగించుకుంటున్నారు. ఇటీవలే సీఎం ఇంటికి రెండు కోట్లకు కొత్త సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సీఎం అడుగు బయటపెడితే ప్రత్యేక విమానాలు.. తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్లాలన్నా హెలికాఫ్టర్ వాడుతున్నారు.

ఆర్థికంగా దుర్భర పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం ఖర్చులు తగ్గించుకుంటుంది. కానీ ఏపీ మాత్రం దుబారా చేస్తోంది. అందుకే ప్రజలు కూడా ఇదేం ఖర్మ అనుకోక తప్పడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దానం ఓడిపోయేందుకే పోటీ చేస్తున్నారా..?

అనుభవజ్ఞుడు, సమర్ధుడని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కట్టబెడితే దానం నాగేందర్ మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వైఖరితో కాంగ్రెస్ పెద్దలే విసుగు చెందగా గ్రేటర్ హైదరాబాద్ నేతలు కూడా దానంపై...

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close