బీఆర్ఎస్‌గా పేరు మార్చుకుని టీడీపీ ఎంట్రీని సహించలేకపోతున్నారెందుకు ?

తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ వాదాన్ని వదిలేసింది. ఇప్పుడు తమది అంతా జాతీయ వాదం అని భారత రాష్ట్ర సమితిగా పార్టీని మార్చేశారు. తమ పార్టీ దేశం అంతా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఏపీలోనూ క్రిస్మస్ తర్వాత బీఆర్ఎస్ కిసాన్ సెల్ శాఖను పెట్టబోతున్నారు. ఇలాంటప్పుడు ఇక ఇతర పార్టీలు తెలంగాణలోకి వస్తే.. నిందించడం.. తమను తాము తక్కువ చేసుకోవడమే. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు అదే చేస్తున్నారు. గతంలో టీడీపీపై ఆంధ్రాపార్టీ అనే ముద్ర వేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ నే ఏపీలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు.కానీ టీడీపీ మాత్రం తెలంగాణలో వద్దంంటున్నారు.

ఖమ్మం బహిరంగసభ తర్వాత తెలంగాణ రాజకీయం ఒక్క సారిగా మారిపోయింది. బీఆర్ఎస్ నేతలు మాత్రం టీడీపీపై ఎదురుదాడి చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు తప్ప ఇంకెవరూ టీడీపీ సభపై అటు పాజిటివ్ గా కానీ.. ఇటు నెగెటివ్ గా కానీ స్పందించలేదు. చంద్రబాబునాయుడు ఖమ్మం బహిరంగసభలో పార్టీని వీడిన పాత నేతలందర్నీ కలసి రమ్మన్నారు. టీడీపీ బలపడితే ఆ మేరకు తమకే నష్టం జరుగుతుందనే అంచనాకు బీఆర్ఎస్ రావడంతోనే ఎదురుదాడి చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

టీడీపీ యాక్టివ్ అయితే ఎఫెక్ట్ అయ్యే పార్టీల్లో కాంగ్రెస్ కూడా ఉంటుంది. ఇప్పటి వరకూ టీడీపీ సానుభూతి పరులపై ఆశలు పెట్టుకుని కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు రాజకీయాలు చేశారు. రేవంత్ రెడ్డి చంద్రబాబుపై అభిమానం చూపుతారు. దీనికి కారణం.. తెలంగాణలో డీలాపడిపోయిన టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తన వైపు ఉంచుకోవడమేనని చెబుతూంటారు. తెలుగుదశం పార్టీలో చేరిన వారు బీఆర్ఎస్‌లో చేరగా. మిగిలిన వారు చాలా మంది టీ బీజేపీలో చేరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల వైపు వెళ్లలేని కొంత క్యాడర్ కూడా బీజేపీ వైపు మొగ్గింది. ఇప్పుడు టీడీపీ యాక్టివ్ అయితే.. ఆ మేరకు క్యాడర్ టీడీపీకి తిరిగి వస్తే రెండు పార్టీలకూ నష్టమే.

అయితే టీడీపీ తెలంగాణలో బలపడిపోయి అధికారం చేపడుతుందని. ఎవరూ అనుకోవడం లేదు. కానీ ఎంతో కొంత ఓటు బ్యాంక్ ను మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటుందని నమ్ముతున్నారు. గత చరిత్ర దృష్ట్యా చూస్తే.. టీడీపీని తక్కువగా అంచనా వేయలేరు. ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉంటే.. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఖమ్మం జిల్లాలో కొన్ని సీట్లకు గట్టిపోటీ ఇవ్వవొచ్చన్న అంచనా ఉంది. అయితే టీడీపీ చీల్చే ఓట్లే కొన్ని రాజకీయ పార్టీల గెలుపోటములని తారుమారు చేయవచ్చన్నది ఎక్కువ మంది అంచనా. ఇదే ఇప్పుడు కీలకం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

థియేట‌ర్ Vs ఓటీటీ… తీర్పు మారుతోందా?

సినిమా వెండితెరపై ఆస్వాదించే వినోదం. ఒక సమూహంతో కలసి థియేటర్ లో సినిమా చూడటంలో కిక్కే వేరు. అయితే ఇప్పుడు థియేటర్ కి సమాంతరంగా ఓటీటీ కూడా ఎదుగుతోంది. సినిమా వ్యాపారంలో కీలక...

ఇదేందయా ఇది- కిషన్ రెడ్డిపై కంప్లైంట్..!

కేంద్రమంత్రి, సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈసీకి ఫిర్యాదు అందింది. ఓటు వేసిన అనంతరం ఎన్నికల ప్రవర్తన నియామళికి విరుద్దంగా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్...

అధికారం నెత్తికెక్కితే పాతాళంలోకే !

అధికారం ప్రజలు ఇచ్చేది. అలాంటి ప్రజల కన్నా తానే ఎక్కువ అనుకుంటే.. పాతాళంలోకి పంపేస్తారు ప్రజలు. చరిత్రలో జరిగింది ఇదే. ఇప్పుడు జరుగుతోంది ఇదే. భవిష్యత్ లో జరగబోయేది కూడా ఇదే. ఎందుకంటే...

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న పోలింగ్ … ఓటేసిన ప్రముఖులు

ఎంపీ ఎనికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని క్యూ లైన్ లో నిల్చొని ఓటు వేశారు. ప్రజలంతా తమ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close